News March 5, 2025

HYD: బీజేపీ నిర్ణయం దుర్మార్గం: కేటీఆర్

image

ఆదిలాబాద్‌లోని సీసీఐ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధంకావడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీసీఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలంటే బీజేపీకి పట్టింపు లేదని, ఆ సంస్థను స్క్రాప్ కింద అమ్మాలని చూస్తుండటం ప్రజలను వంచించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News March 5, 2025

తెలంగాణ సచివాలయం ముందు కూల్ ఐడియా

image

పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సచివాలయం వద్ద అధికారులు కూల్ ఐడియా అమలు చేశారు. సచివాలయానికి వచ్చే సందర్శకులు, అధికారులను తనిఖీ చేసే సమయంలో ఎండకు ఇబ్బంది పడకుండా గేట్ నంబర్-2 వద్ద టెంట్లు ఏర్పాటు చేశారు. టెంట్ నీడ కింద భద్రతా సిబ్బంది తనిఖీలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు.

News March 5, 2025

డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీకాం, బీబీఏ, బీఏ, బీబీఏ రిటైల్ ఆపరేషన్స్, బీబీఏ లాజిస్టిక్స్, బీబీఏ ఫ్యాషన్ మేనేజ్మెంట్, బీబీఏ ఫ్యాషన్ డిజైన్ మేనేజ్మెంట్, బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ 3, 5 సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈనెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.

News March 5, 2025

HYDలో బీర్లపై పాత ధరలు.. ఇదేంటి?

image

HYDలో బీర్ సీసాలపై పాత ధరలే దర్శనమిస్తున్నాయని ఓ కస్టమర్ తెలిపారు. నాగోల్‌లోని వైన్ షాపులో బుధవారం బీఎస్ పాటిల్ అనే వ్యక్తి 2 బీర్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. MRP మాత్రం రూ.210గా ఉంది. ఇటీవల పెంచిన ధరల ప్రకారం రూ.250కి అమ్మినట్లు పేర్కొన్నారు. లేబుల్స్‌పై పాత ధరలు ఉండటం ఏంటని నిలదీస్తే వైన్స్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోయారు. మీప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.

error: Content is protected !!