News August 10, 2024
HYD: బీబీనగర్ AIIMS వైద్య సేవలు రిపోర్ట్

HYD శివారు బీబీనగర్ AIIMS 2023-24 సంవత్సరానికి సంబంధించి 3,65,395 మంది అవుట్ పేషెంట్లు, 7,953 మంది ఇన్ పేషెంట్లకు వైద్య సేవలు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. 750 పడకల సామర్థ్యం ఉన్న ఈ సంస్థలో ప్రస్తుతం 20 స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడ వంద మంది ఎంబీబీఎస్, 30 మంది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు చదువుతున్నారు.
Similar News
News July 11, 2025
HYD: కల్తీ కల్లు తాగి ఎనిమిది మంది మృతి

కల్తీ కల్లు <<17017648>>రాజేసిన అగ్గి<<>> ఇంకా చల్లారడంలేదు. ఈ ప్రమాదపు కల్లు తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ పెద్ద గంగారాం (70) అర్ధరాత్రి 1:30కు గాంధీ హాస్పిటల్లో మృతి చెందాడు. కూకట్పల్లి PS పరిధిలోని ఆదర్శనగర్లో ఆయన నివాసం ఉండేవారు. ఈయన మరణంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. 30 మందికి పైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొంతుతున్నారు.
News July 11, 2025
HYD: IITHలో మినీ డ్రోన్ కాంపిటీషన్

IITHలో మినీ డ్రోన్ కాంపిటీషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మ్యాథ్ వర్క్ TiHAN పేరిట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కాంపిటీషన్లో పాల్గొనడానికి జులై 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా వివరించారు. ఈ కాంపిటీషన్లో మూడు రౌండ్లు ఉంటాయన్నారు. కాంపిటీషన్ మెటీరియల్ సైతం అందించే అవకాశం ఉందన్నారు. వెబ్సైట్ spr.ly/60114abzL ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
News July 11, 2025
GHMCలో డిప్యూటీ కమిషనర్ల బదిలీలు

GHMCలో డిప్యూటీ కమిషనర్లు బదిలీ అయ్యారు. ఇటీవల పలువురు మున్సిపల్ కమిషనర్లు పదోన్నతులు పొందిన నేపథ్యంలో జీహెచ్ఎంసీలోనే పనిచేస్తున్న వారిని ఇతర సర్కిళ్లకు బదిలీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 23 మంది ట్రాన్స్ఫర్, పోస్టింగ్లు పొందారు.