News January 8, 2025
HYD: బీర్ల రేటు పెంపుపై కమిటీ నిర్ణయమే ఫైనల్: మంత్రి
బీర్ల రేట్లు పెంచనందుకు బీర్ల స్టాక్ పంపమని బేవరేజ్ సంస్థ ప్రకటించింది. 33శాతం పెంచమని అడుగుతున్నారని, ఇలా పెంచితే ఇప్పుడు రూ.150 రూపాయలు ఉన్న బీర్ రూ.250 పెరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బేవరేజ్ సంస్థ అడిగినట్లు రేట్లు పెంచితే ప్రజలపై భారం పడుతుందన్నారు. రేట్లు పెంచే సిస్టం కోసం రిటైర్డ్ జడ్జితో కమిటీ వేశామన్నారు. కమిటీ నివేదిక వచ్చాక రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
Similar News
News January 13, 2025
HYD: పండ్లు, కూరగాయలు కొంటున్నారా..ఇలా చేయండి!
హైదరాబాద్లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసి, తినే వారికి GHMC, ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు సూచనలు చేశారు. శుభ్రమైన నీటితో మొదట కడగాలన్నారు. కడగటానికి ఉపయోగించే నీటిలో ఏవైనా విష పదార్థాలు ఉంటే, మనం తినే ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఉందన్నారు. తద్వారా ఫుడ్ పాయిజనింగ్ జరగటం, అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందన్నారు. నీటిలో కాస్తంత ఉప్పు వేసి, కడిగితే మరింత మేలని సూచించారు.
News January 13, 2025
HYD: మాజీ ఎంపీ భౌతికకాయానికి మంత్రి నివాళులు
నాగర్కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం భౌతికకాయానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు నివాళులు అర్పించారు. HYDచంపాపేట్లోని ఆయన నివాసానికి వెళ్లి జగన్నాథం కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. జగన్నాథంతో తనకున్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి బాధాకరమని, ఎంపీగా ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారని, ఓ సీనియర్ నాయకుడిని రాష్ట్రం కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
News January 13, 2025
HYD: చైనా మాంజా.. జర జాగ్రత్త గురూ!
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు చిన్నా పెద్ద తేడా లేకుండా, ఈలలతో గోల చేస్తూ పోటాపోటీగా పతంగులు ఎగరేస్తారు. చైనా మాంజా అమ్మినా.. కొన్నా.. జైలు శిక్షే అని ఇప్పటికే HYD,ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. చైనా మాంజా కారణంగా పక్షులతో పాటు మనుషులు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు. పంతంగులను ఎగురవేసేందుకు మాంజాను విక్రయించినా, ఎగురవేసినా అరెస్టులు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది.