News July 31, 2024
HYD: బ్యాంకులో భారీ స్కామ్.. మేనేజర్ ARREST

శంషాబాద్ ఇండస్ఇండ్ బ్యాంక్లో రూ.40 కోట్ల స్కామ్ జరిగిన విషయం తెలిసిందే! ఈ భారీ స్కామ్లో బ్యాంక్ మేనేజర్ రామస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో బ్యాంకు ఉద్యోగి రాజేశ్తో కలిసి రూ.40 కోట్లు స్వాహా చేశారు. సినీ నిర్మాత షేక్ బషీద్కు మేనేజర్ రూ.40కోట్లు బదిలీ చేశాడు. అక్కడినుంచి మరికొన్ని అకౌంట్లకు సొమ్ము ట్రాన్స్ఫర్ అయినట్లు తేలింది.
Similar News
News November 7, 2025
HYD: KTR.. రాసిపెట్టుకో..!: కాంగ్రెస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక BRS పార్టీ పతనానికి రెఫరెండమని, మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే శాశ్వతంగా దూరంకొట్టారని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘ఇప్పుడు జూబ్లీహిల్స్లోనూ మీ సీటు గాయబే.. ఇక్కడి నుంచి మీ పార్టీ కనుమరుగు కావడం ఖాయం.. రాసిపెట్టుకో KTR’ అని పేర్కొంది. కాగా జూబ్లీహిల్స్లో BRS గెలవదని, కచ్చితంగా తామే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
News November 7, 2025
జూబ్లీహిల్స్ బైపోల్స్: రూ.3.33 కోట్లు సీజ్

ఎన్నికలంటే మాటలా.. మొత్తం డబ్బుతోనే పని.. అందుకే నాయకులు వివిధ మార్గాల్లో డబ్బు తరలిస్తుంటారు. అలా వివరాలు లేక పట్టుబడిన డబ్బును పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.3.33 కోట్లను సీజ్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. అయితే వివరాలు చెప్పిన వారికి డబ్బు తిరిగి ఇస్తున్నామని పేర్కొన్నారు.
News November 7, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: అధిష్టానం చూస్తోంది బాసూ..!

ఒక్క హైదరాబాదు వాసులే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపు చూస్తున్నారు. అంతేకాదు ఆయా పార్టీల అధిష్ఠానాలు కూడా ఈ ఎన్నికలపై ఆసక్తి చూపుతున్నాయి. ఎలాగైనా గెలిచి ఢిల్లీలో తమ సత్తా ఏంటో చూపించాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరాటపడుతున్నారు. కేటీఆర్ మాత్రం గెలిచి KCRకు ఈ విజయం బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక్కడ పట్టుకోసం, ఢిల్లీలో పరువు కోసం నాయకులు పాకులాడుతున్నారు.


