News June 28, 2024
HYD: బ్లాస్ట్.. చెల్లాచెదురుగా మృతదేహాలు, కాళ్లు, చేతులు..!

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధి బూర్గులలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో బ్లాస్ట్ జరిగి ఆరుగురు మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. కాగా ఒక్కసారిగా కంప్రెషర్ గ్యాస్ పేలడంతో కార్మికులు ఎగిరిపడ్డారు. మృతదేహాలు, మాంసపు ముద్దలు, కార్మికుల అవయవాలు, కాళ్లు, చేతులు పరిశ్రమలో చెల్లాచెదురుగా పడిపోయాయి. అక్కడి పరిస్థితిని చూసిన స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. శంషాబాద్ DCP రాజేశ్ పరిశీలించారు.
Similar News
News September 17, 2025
బేగంపేట ఎయిర్పోర్టులో రాజ్నాథ్కు వీడ్కోలు

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. పర్యటన అనంతరం తిరిగి ఢిల్లీ వెళుతున్న సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో కిషన్ రెడ్డి, రాష్ట్ర BJP అధ్యక్షుడు రామచంద్ర రావు, జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో DCP రష్మీ పెరుమల్, డిఫెన్స్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
News September 17, 2025
హస్తంలో చిచ్చుపెట్టిన జూబ్లీహిల్స్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హస్తం పార్టీలో చిచ్చు పెట్టింది. అభ్యర్థి ఎంపిక అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. పాత నేతలంతా టికెట్ కోసం హస్తిన నుంచి ఫైరవీ మొదలెట్టారు. దానం నాగేందర్, అంజన్ కుమార్, నవీన్ కుమార్, PJR కుమార్తె విజయారెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి బీసీ నేతను పోటీకి దింపేందుకు INC నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు CM, TPCC చీఫ్ నిర్ణయమే కీలకంగా మారుతోంది.
News September 17, 2025
నిజాం ఒక్కడు కాదు.. ఒక వంశం

అసఫ్ జా వంశానికి చెందిన రాజులే ఈ నిజాంలు. 1724లో హైదరాబాద్లో వీరి పాలన మొదలై, 1948 వరకు (225 ఏళ్లు) పాలించారు. నిజాం చెప్పిందే రాజ్యాం.. చేసింది చట్టం. వీరిలో నిజాం ఉల్ ముల్క్(1724-1748) మొదటివాడు. నిజాం అలీఖాన్(1762-1802), నాసిర్ ఉద్దౌలా ఫర్జుందా అలీ(1829-1857), అఫ్జల్ ఉద్దౌలా మీర్ టెహ్షియత్ అలీ ఖాన్(1857-1869), ఫతే జంగ్ మహబూబ్ అలీ ఖాన్(1869-1911), ఇక చివరి వాడే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్(1911-1949).