News October 5, 2024
HYD: భారత్-బంగ్లా టీ20 మ్యాచ్.. నేడు టికెట్ల విక్రయం ప్రారంభం!

భారత్-బంగ్లా మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈ నెల 12న ఉప్పల్లో జరగనుంది. మ్యాచ్ టికెట్లు ఈ రోజు నుంచి విక్రయించనున్నట్లు HCA అధ్యక్షుడు జగన్మోహన్ తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి పేటీఎంలో టికెట్లను విక్రయించనున్నట్లు చెప్పారు. టికెట్ ప్రారంభ ధర రూ.750 నుంచి రూ.15 వేలు ఉందన్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్లను ఈ నెల 8 నుంచి 12 వరకు జింఖానా స్టేడియంలో రిడంప్షన్ చేసుకోవాలన్నారు.
Similar News
News November 28, 2025
సనత్నగర్: పదో అంతస్తు నుంచి పడి బీటెక్ విద్యార్థిని మృతి

సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్పతరువు రెసిడెన్సీ అపార్ట్మెంట్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి మృతి చెందింది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 28, 2025
HYD: మెగా కార్పోరేషన్గా జీహెచ్ఎంసీ

ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఉన్న మున్సిపాలిటీల విలీనంతో GHMC మెగా కార్పోరేషన్గా అవతరించింది. కాగా కార్పోరేషన్ను 2 లేదా 3గా విభజించాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్ని ముక్కలుగా విభజించాలనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది. సంస్థాగత పునర్విభజన, కార్పొరేషన్ బట్టి ఉన్నందున ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా వీటిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తుందని టాక్.
News November 28, 2025
HYD: గడువు ముగిసిన తర్వాతే ‘విలీనం’ !

జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుత గ్రేటర్ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఈ గడువు ముగిసిన తరువాతే సర్కారు జీఓను విడుదల చేయనున్నట్లు సమాచారం. విలీన నిర్ణయాన్ని పాలక మండలి ఆమోదించినా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ ఆలస్యం చేయనున్నట్లు తెలిసింది.


