News January 29, 2025

HYD: భారత్ మహిళా కెప్టెన్‌గా చూస్తామని ఆశిస్తున్నా: కేటీఆర్

image

అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి మహిళగా తెలంగాణ అమ్మాయి త్రిష గొంగిడి రికార్డు సృష్టించడం పట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌లో అద్భుతమైన ఫీట్‌ సాధించిందని కొనియాడారు. దేశ గౌరవాన్ని పెంచడంతో పాటు.. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో మార్మోగేలా చేశావని ప్రశంసించారు.

Similar News

News February 13, 2025

HYD: రంగరాజన్‌పై దాడి.. 12 మంది అరెస్ట్

image

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే దాడి కేసులో ఇప్పటివరకు పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 14 మంది పరారీలో ఉన్నారు. వీరిలో భద్రాచలం వద్ద మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

News February 13, 2025

HYD: ఫ్రీ కరెంట్.. పైగా ఖాతాలోకి నగదు

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ విద్యుత్‌శాఖ ఏఈ మురళీకృష్ణ సూచించారు. ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుంటే ఉపయోగాలు సూచించారు. ప్యానెల్స్‌ను అనుసంధానించి ఇంట్లో ఏర్పాటు చేసిన మీటర్ ద్వారా వినియోగించగా మిగిలిన విద్యుత్ డిస్కంలకు సరఫరా అవుతుంది. డిస్కంలతో ఒప్పందం ప్రకారం 6 నెలలకు ఒకసారి లెక్కేసి ఖాతాలో నగదు జమ చేస్తారు. #SHARE IT

News February 13, 2025

LBనగర్‌: ఆస్పత్రిలో మైనర్ బాలుడు మృతి.. ఆందోళన

image

మైనర్ బాలుడు మృతి చెందిన ఘటన ఎల్బీనగర్‌లోని ఆరెంజ్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్ల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలుడు మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!