News January 26, 2025

HYD: భారీగా తగ్గిన టమాటా ధరలు

image

టమాటా ధరలు మునుపెన్నడూ లేని విధంగా పడిపోయాయి. జంట నగరాల అవసరాలకు సరిపడా టమాట ఉత్పత్తి పెరగడంతో ప్రస్తుతం గుడిమల్కాపూర్, ఎల్బీనగర్, బోయిన్‌పల్లి, మాదన్నపేట మార్కెట్లలో టమాటా ధరలు భారీగా తగ్గాయి. హోల్ సేల్ మార్కెట్లో కిలో రూ.3 నుంచి రూ.8 వరకు ఉండగా.. రిటైల్ మార్కెట్లో కిలో రూ.7 నుంచి రూ.10 వరకు పలుకుతోంది. మీ ప్రాంతంలో ఎంతకు విక్రయిస్తున్నారు. 

Similar News

News November 18, 2025

వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి: నిర్మల్ ఎస్పీ

image

శీతాకాలం నేపథ్యంలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. బైక్‌లు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రహదారిపై ఓవర్ టేక్‌లు చేయకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. సాధ్యమైనంత వరకు రాత్రి, తెల్లవారుజాముల్లో ప్రయాణాలు చేయవద్దన్నారు.

News November 18, 2025

ఢిల్లీలో అవార్డు అందుకున్న నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో 2024-25 సంవత్సరంలో భూగర్భ జలాల పెంపుకు చేపట్టిన చర్యలను అభినందిస్తూ కేంద్రం అవార్డు ప్రకటించింది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి పాటిల్ చేతులమీదుగా ఆ అవార్డును అందుకున్నారు. భూగర్భ జలాల పెంపు కోసం వర్షాన్ని ఒడిసిపట్టేందుకు జిల్లాలో 3,495 ఇంకుడు గుంతలు, 856 ఫామ్ పాండ్స్‌తో కలిపి 5,502 భూగర్భ జలాల రీఛార్జ్ పనులు చేసినందుకు అవార్డు లభించినట్లు సమాచారం.

News November 18, 2025

సికింద్రాబాద్ MRO ఆఫీసులో ఏసీబీ సోదాలు

image

సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా సర్వేయర్ కిరణ్ పట్టుబడ్డాడు. ఎమ్మార్వో కార్యాలయంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సర్వేయర్ కిరణ్‌తో పాటు చిన్న మెన్ భాస్కర్లను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.