News January 26, 2025
HYD: భారీగా తగ్గిన టమాటా ధరలు

టమాటా ధరలు మునుపెన్నడూ లేని విధంగా పడిపోయాయి. జంట నగరాల అవసరాలకు సరిపడా టమాట ఉత్పత్తి పెరగడంతో ప్రస్తుతం గుడిమల్కాపూర్, ఎల్బీనగర్, బోయిన్పల్లి, మాదన్నపేట మార్కెట్లలో టమాటా ధరలు భారీగా తగ్గాయి. హోల్ సేల్ మార్కెట్లో కిలో రూ.3 నుంచి రూ.8 వరకు ఉండగా.. రిటైల్ మార్కెట్లో కిలో రూ.7 నుంచి రూ.10 వరకు పలుకుతోంది. మీ ప్రాంతంలో ఎంతకు విక్రయిస్తున్నారు.
Similar News
News February 11, 2025
MBNR: జీరో(0) బిల్లు.. ఉమ్మడి జిల్లాలో ఎంతమందంటే!

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఇప్పటివరకు మహబూబ్ నగర్-1,29,451, నాగర్ కర్నూల్-1,06,525, నారాయణపేట-77,092, గద్వాల్-84,114, వనపర్తి-80,418 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరూ నెలకు 200 యూనిట్లలోపు(జీరో బిల్) విద్యుత్ వినియోగించుకుంటున్నారు. ఈ పథకం ద్వారా ఆయా జిల్లాల్లో విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారులు తెలిపారు.
News February 11, 2025
కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

TG: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయమని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇవాళ ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం మాట్లాడుతూ స్టేషన్ ఘన్పూర్లోనూ ఉపఎన్నిక వస్తుందని కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య గెలుస్తారని జోస్యం చెప్పారు. ఉపఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
News February 11, 2025
HYD: కన్నీటి ఘటన.. మృతులు వీరే..!

ప్రయాగ్ రాజ్ వెళ్లి వస్తుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదం నింపింది.ఘటనలో HYD నాచారం కార్తికేయ నగర్ ప్రాంతానికి చెందిన 1.శశికాంత్(38),2.మల్లారెడ్డి (60), 3.రవి రాంపల్లి (56), 4.రాజు నాచారం ఎర్రకుంట, 5.సంతోష్ (47), 6.ఆనంద్ రెడ్డి ముసారంబాగ్,7.టీవీ ప్రసాద్ నాచారం గోకుల్ నగర్ మృత్యువాత పడ్డారు.కాగా.. ప్రమాద ఘటనలో 8.నవీన్ చారి,9.బాలకృష్ణకు స్వల్ప గాయాల పాలై ప్రాణాలతో బయటపడ్డారు.