News April 28, 2024

HYD: భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్య

image

భార్యతో గొడవపడిన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కీసర PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. బీబీనగర్‌ మండలానికి చెందిన మహేశ్(38) భార్య భవాని తన ఫోన్‌ ద్వారా ఓ వ్యక్తికి ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపింది. ఇది గమనించిన మహేశ్ తన భార్యను నిలదీయగా.. పుట్టింటికి వెళ్లింది. దీంతో మహేశ్ తన బావమరిదికి వీడియో కాల్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News October 14, 2025

జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పోటీపై ఒవైసీ కీలక ప్రకటన

image

​జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు MIM అభ్యర్థిపై ఒకటి, రెండురోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. పదేళ్ల BRS పాలనలో జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి లేదన్న ఆయన.. BRS నుంచి ఇక్కడ మంత్రి ఉన్నప్పటికీ కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయారన్నారు. బీజేపీకి పాజిటివ్‌గా ఉండటానికి తాను అభ్యర్థిని నిలబెడతాననే విమర్శలు వస్తాయన్న ఆయన.. కాంగ్రెస్‌కు తాము ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నించారు.

News October 14, 2025

తార్నాక మౌలిక ఆత్మహత్య కేసులో అంబాజి అరెస్ట్

image

HYD తార్నాకలోని కాలేజీ విద్యార్థిని మౌలిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు అంబాజీ నాయక్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ట్రైన్‌లో అదుపులోకి తీసుకున్నారు. అంబాజీ నాయక్ పాత ఫోన్‌లో మౌలికను వేధిస్తూ చేసిన మెసేజ్‌ల డేటా ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

News October 14, 2025

HYD: ‘మటన్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్’

image

మటన్ వినియోగంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. నేషనల్ మీట్ రీసెర్చ్ ఇనిస్టిట్టూట్(చెంగిచర్ల) లెక్కల ప్రకారం దేశంలో మటన్ అత్యధికంగా ఆరగించే రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉందని HYD ఫుడ్ సంస్థ లుక్మి పేర్కొంది. సాధారణంగా మాంసం వినియోగం ప్రకారం ఓ వ్యక్తి ఏడాదికి 7 కేజీల మటన్ ఆరగించే అవకాశం ఉందని.. కానీ తెలంగాణలో నాలుగు రెట్లు అధికంగా 24 కేజీల మటన్ తింటున్నట్లు సంస్థ వెల్లడించింది.