News April 28, 2024
HYD: భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్య

భార్యతో గొడవపడిన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కీసర PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. బీబీనగర్ మండలానికి చెందిన మహేశ్(38) భార్య భవాని తన ఫోన్ ద్వారా ఓ వ్యక్తికి ఫోన్పే ద్వారా డబ్బులు పంపింది. ఇది గమనించిన మహేశ్ తన భార్యను నిలదీయగా.. పుట్టింటికి వెళ్లింది. దీంతో మహేశ్ తన బావమరిదికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 20, 2025
బొల్లారంలో పూలు గుసగుసలాడేనని.. సైగ చేసేనని

అందమైన పూలు.. అలరించే రంగులు.. మనలను కనువిందు చేయనున్నాయి. కొత్త ఏడాదిలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఇందుకు వేదిక కానుంది. JAN 3 నుంచి 9 రోజుల పాటు (11 వరకు) ఉ. 10 నుంచి రాత్రి 8 వరకు ఉద్యాన్ ఉత్సవ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకగా సాగుతున్నాయి. ప్రవేశం ఉచితమని.. ప్రకృతి ప్రేమికులు ఈ అవకాశం వినియోగించుకోవాలని రాష్ట్రపతి నిలయం ఆఫీసర్ రజినీ ప్రియ తెలిపారు.
News December 20, 2025
గండిపేట: నిఘా నేత్రాలకు పక్షవాతం!

₹కోట్లు కుమ్మరించి నిర్మించిన గండిపేట ల్యాండ్స్కేప్ పార్కులో భద్రత గాలిలో దీపమైంది! అక్కడి నిఘా నేత్రాల పనిచేయక అక్రమార్కుల ధాటికి చెరువు కాలుష్యపు కోరల్లో చిక్కుకుంది. ఎట్టకేలకు నిద్రలేచిన HMDA, కెమెరాల మరమ్మతులు, ఏడాది నిర్వహణ O&Mకు ₹14,62,079తో టెండర్లు పిలిచింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన, కాలుష్యం ముదిరిన తర్వాత ఇప్పుడు మరమ్మతులకు పూనుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News December 20, 2025
మహానగరం ఫుల్ పిక్చర్ రేపే విడుదల?

మున్సిపాలిటీల విలీనం తర్వాత పునర్విభజనకు సంబంధించి మహానగర వ్యాప్తంగా 5,905 అభ్యంతరాలతో పాటు సలహాలు కూడా వచ్చాయి. వీటన్నింటిని పరిశీలించిన గ్రేటర్ అధికారులు తుది నివేదికను రూపొందించారు. ఇందుకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ రేపు విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సర్కారు పెద్దలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


