News April 28, 2024
HYD: భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్య

భార్యతో గొడవపడిన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కీసర PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. బీబీనగర్ మండలానికి చెందిన మహేశ్(38) భార్య భవాని తన ఫోన్ ద్వారా ఓ వ్యక్తికి ఫోన్పే ద్వారా డబ్బులు పంపింది. ఇది గమనించిన మహేశ్ తన భార్యను నిలదీయగా.. పుట్టింటికి వెళ్లింది. దీంతో మహేశ్ తన బావమరిదికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 14, 2026
HYD: 8712661212 నం.కు కాల్ చేయండి!

హైదరాబాద్ లో మామిడి పండ్లు కుళ్లిపోయినవి, నాణ్యతపై అనుమానం ఉన్నవి విక్రయిస్తే వెంటనే స్పందించాలి. అలాంటి ఘటనలు గమనించిన వినియోగదారులు 87126 61212 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికార యంత్రాంగం సూచించింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఫుడ్ సేఫ్టీ H-FAST విభాగం ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తోంది.
News April 14, 2026
HYD: అందమైన అమ్మాయిలతో సంపాదన

యువతే వీరి టార్గెట్. అందమైన అమ్మాయిలతో ఆడియో, వీడియో <<19614819>>కాల్స్<<>> అంటూ ఈ యాప్స్ వ్యాపారం చేస్తున్నాయి. వీటి మోజులో పడి యువతి, యువకులు అనేక కేసుల్లో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దోస్త్, కనెక్ట్, ఫ్రెండ్ లాంటి యాప్స్పై Gen-S సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. 18- 45 ఏళ్ల మహిళలు ఈ యాప్స్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారని, యువకులు వారితో మాట్లాడటానికి డబ్బు, సమయం వృథా చేసుకుంటున్నట్లు పేర్కొంది.
News April 14, 2026
HYD: BJPకి క్రైస్తవుల మద్దతు: TG చీఫ్

భిన్నత్వంలో ఏకత్వానికి, సర్వమత సామరస్యానికి భారతదేశం గొప్ప ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. HYDలో క్రైస్తవులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ అభివృద్ధి అజెండాను విశ్వసిస్తూ కేరళం, గోవా లాంటి రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజం పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు తెలుపుతుండటం హర్షణీయమన్నారు.


