News February 18, 2025

HYD: భార్యను పంపమని ఆమె భర్తనే అడిగాడు..!

image

పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి నిప్పంటించుకున్న ఘటన మధురానగర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. యాదగిరినగర్‌లో దంపతులు నివాసం ఉంటున్నారు. భార్యకు సూర్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మద్యం తాగి ఇంటికి వచ్చి ‘మీ భార్యను నాకు ఇచ్చేయ్, జీవితాంతం సంతోషంగా చూసుకుంటా’అని భర్తతో అన్నాడు. భర్త ఆగ్రహించడంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News December 11, 2025

సంగారెడ్డి: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ప్రావీణ్య

image

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. చలి తీవ్రతను లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి నిలబడటంతో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య తాళ్లపల్లి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.

News December 11, 2025

కర్నూలు డైట్ కాలేజీలో విద్యార్థిని సూసైడ్?

image

కర్నూలు డైట్ (TTC) ప్రభుత్వ కాలేజీలో విషాద ఘటన చోటుచేసుకుంది. నంద్యాల(D) మిడుతూరు మండలం చింతలపల్లికి చెందిన చంద్రకళ(17) కాలేజీ హాస్టల్‌ గదిలో కిటికీకి ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. ఈ ఘటనతో విద్యార్థులు, సిబ్బంది ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 11, 2025

చేపల చెరువుల్లో నీటి నాణ్యత కోసం సూచనలు

image

చేపల చెరువుల్లో పాడిల్ వీల్ ఎరేటర్లు వాడటం ద్వారా చెరువుల్లో ప్రాణ వాయువును పెంచుకోవచ్చు. పరిమితికి మించి చెరువులో చేప పిల్లలను వదలకూడదు. అలాగే చేపల సంఖ్యను బట్టి ఆహారం వేయాలి. ఎక్కువగా వేస్తే చేపలు తినగా మిగిలిన ఆహారం కుళ్లిపోయి చెరువులో ప్రాణ వాయువు పరిమాణాన్ని తగ్గిస్తుంది, అమ్మోనియా మోతాదును పెంచుతుంది. అలాగే చెరువులో పెరిగే కలుపు మొక్కలను నివారిస్తే నీటి నాణ్యత మెరుగుపడుతుంది.