News July 6, 2024
HYD: మంత్రిని కలిసిన BRS ఎమ్మెల్యేలు

గ్రేటర్ HYD, మేడ్చల్ జిల్లా పరిధి BRS ఎమ్మెల్యేలు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని శనివారం కలిశారు. పలు సమస్యలపై వినతి పత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ MLA కేపీ వివేకానంద, ఉప్పల్ MLA లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి, మల్కాజిగిరి MLA రాజశేఖర్ రెడ్డి, కూకట్పల్లి MLA కృష్ణారావు, శేరిలింగంపల్లి MLA అరికెపూడి గాంధీ మంత్రి సమావేశం అయ్యారు.
Similar News
News November 12, 2025
HYD: శ్రీధర్రావు ఆక్రమణలను తప్పుబట్టిన హైకోర్టు

గచ్చిబౌలిలోని FCI ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ఆక్రమణలను హైకోర్టు తప్పు పట్టింది. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగణించింది. మెజార్టీ ప్లాట్లు తనవే అనే ఉద్దేశంతో ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. అందుకే హైడ్రా ఆ ఆక్రమణలను తొలగించిందని పేర్కొంది.
News November 12, 2025
HYD: ఒక్క నెలలో రూ.13 కోట్లు తగ్గిన ఎకరం!

రియల్ ఎస్టేట్ రంగం ఇటీవల కాలంలో మందగమనంలోకి వెళ్లిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. తాజాగా టీజీఐఐసీ నిర్వహించిన రాయదుర్గ్ పాన్మక్తా భూముల వేలంలో ఎకరాకు రూ.164 కోట్లు మాత్రమే పలకడం వివాదాస్పదంగా మారింది. గత నెలలో ఇదే ప్రాంతంలో ఎకరాకు రూ.177 కోట్లు వచ్చినప్పటికీ, ఒక్క నెలలోనే రూ.13 కోట్ల తేడా రావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ధరల వ్యత్యాసం వెనుక రాజకీయ ప్రభావం ఉందా? అనే చర్చ నడుస్తోంది.
News November 12, 2025
జూబ్లీహిల్స్: ‘కంపల్సరీ ఓటు’ చట్టం తెస్తే తప్ప మారరేమో..!

ప్రజాస్వామ్యం ప్రాణం పోసుకోవాలంటే ఓటు వేయండని ప్రభుత్వాలు, ఈసీ చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకు జూబ్లీహిల్స్ ఎన్నికలే నిదర్శనం. కేవలం 48.49 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. కనీసం 50 శాతం కూడా దాటలేదు. ఇలా అయితే సమస్యలు అలాగే ఉండిపోతాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటు వేయాల్సిందే అనే చట్టం తీసుకురావాలేమో.. అప్పుడైనా మన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తారేమో ఏమంటారు?


