News October 7, 2024
HYD: మంత్రి తుమ్మల తీపికబురు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు అందించారు. రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో వేస్తామని మంత్రి వెల్లడించారు. సోమవారం గాంధీభవన్లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. తెలంగాణలో రుణమాఫీ హామీ అమలు కాలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.
Similar News
News December 3, 2025
ముందుగా ఆర్డినెన్స్.. తర్వాత వీలిన నోటిఫికేషన్

గ్రేటర్ HYDలో మున్సిపాలిటీల విలీనానికి సంబంధించి ఆర్డినెన్స్ రావాల్సి ఉంది. వీలీన ప్రక్రియను గవర్నర్ ఇప్పటికే ఆమోదించడంతో త్వరలో ఆర్డినెన్స్ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఆ తర్వాత 3 రోజులకు ఇందుకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వస్తుంది. ఇందుకోసం అధికారులు పేపర్వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా వార్డుల విభజనకు సంబంధించి ప్రజాభిప్రాయం కూడా సేకరించనున్నారు.
News December 3, 2025
HYD: మౌలమేలనోయి.. అది శిక్షార్షమోయి!

నేరం జరిగిందని మీకు తెలుసా? మనకెందుకులే అని ఊరికే ఉన్నారా? అయితే మీరు నేరం చేసినట్లే లెక్క. తప్పు జరిగిందని తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. విచారణలో ఈ విషయం వెల్లడైతే మీపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. జూబ్లీహిల్స్లో ఓ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనలో మౌనంగా ఉన్న ఇద్దరు మహిళలను పోలీసులు నిందితులుగా చేర్చారు. BNS సెక్షన్ 211, 33 ప్రకారం అభియోగాలు నమోదు చేస్తారు.
News December 3, 2025
HYD: కుక్క దాడిపై సీఎం తీవ్ర ఆవేదన

మూగ బాలుడు <<18449713>>ప్రేమ్ చంద్పై<<>>వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని, అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబానికి అవసరమైన తక్షణ సాయాన్ని ప్రభుత్వం పరంగా అందించాని అధికారులను ఢిల్లీనుంచి ఆదేశించారు. GHMC కమిషనర్ స్వయంగా బాలుడిని పరామర్శించి, వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు.


