News November 7, 2024
HYD: మత్తువైపు మళ్లుతోన్న యువత..!

HYD సహా ఇతర జిల్లాల్లో గంజాయి, డ్రగ్స్ లాంటి అలవాట్ల వైపు యువత దారి మళ్లుతోంది. ఒక్క అక్టోబర్ నెలలోనే HYD జిల్లాలో దాదాపు 2167 కిలోలు, మేడ్చల్ జిల్లాలో 411 కిలోల గంజాయితో పాటు, హాష్ ఆయిల్, నీట్ ఆయిల్, నల్లమందు, MDMA తదితర మత్తు పదార్థాలు పట్టుబడ్డట్లుగా పోలీసులు తెలిపారు. తాజాగా వాటిని ప్రత్యేక పద్ధతుల్లో దహనం చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News October 28, 2025
HYD: ఆన్లైన్లో ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు!

GHMC పౌరులకు సేవలను సులభతరం చేసింది. ఇకపై ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సేవలు ghmc.gov.in ద్వారా ఇంటి నుంచే లభిస్తాయి. పౌరులు మీసేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం తమ PTIN/TIN/VLTN నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేస్తే చాలు. దరఖాస్తులకు త్వరితగతిన ఆన్లైన్ ద్వారానే అనుమతులు లభిస్తాయి.
SHARE IT
News October 28, 2025
జూబ్లీ బైపోల్: మంత్రులకు డివిజన్ల బాధ్యతలు

జూబ్లీహిల్స్ బైపోల్లో భాగంగా డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. రహమత్నగర్- కోమటిరెడ్డి, పొంగులేటి, బోరబండ- సీతక్క, మల్లు రవి, వెంగళ్రావునగర్- తుమ్మల, వాకిటి శ్రీహరి, సోమాజిగూడ- శ్రీధర్ బాబు, అడ్లూరి, షేక్పేట్- కొండా సురేఖ, వివేక్, ఎర్రగడ్డ- దామోదర, జూపల్లి, యూసుఫ్గూడ- ఉత్తమ్, పొన్నం ప్రభాకర్కు ప్రచార బాధ్యతలు అప్పగించారు.
News October 28, 2025
క్యాబిన్ క్రూ జాహ్నవి గుప్తా ఆత్మహత్య

రాజేంద్రనగర్ పరిధిలో ఇండిగో ఎయిర్లైన్స్లో క్యాబిన్ క్రూగా పనిచేస్తున్న జాహ్నవి గుప్తా ఆత్మహత్య చేసుకుంది. జమ్మూకు చెందిన జాహ్నవి, ఇటీవల ఇండిగో క్యాప్టెన్, స్నేహితుడితో కలిసి పార్టీకి హాజరై, అనంతరం తన గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కొన్ని రోజులుగా ఆమె డిప్రెషన్లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలను మాత్రం తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించడం లేదు.


