News February 20, 2025
HYD: మన పోలీసులకు మెడల్స్.. DGP ప్రశంసలు

జార్ఖండ్లోని రాంచీలో 68వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ పోటీల్లో మన పోలీసులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. 18 పతకాలతో ఓవరాల్ టీమ్ ఛాంపియన్గా అవతరించిందని CID DG షికా గోయల్ అన్నారు. బంగారు పతకాలు-6, రజతం-6, కాంస్య పతకాలు-8 సాధించగా డీజీపీ జితేందర్ వారిని అభినందించారు. పోటీల్లో పాల్గొన్న వారిలో డాగ్ స్క్వాడ్ పోలీసులు, కంప్యూటర్ అవేర్నెస్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ బృందాలు ఉన్నట్లు తెలిపారు.
Similar News
News December 2, 2025
ఆ యాప్ను డిలీట్ చేసుకోవచ్చు: కేంద్రమంత్రి

<<18445876>>సంచార్ సాథీ యాప్పై<<>> కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆ యాప్ కంపల్సరీ ఏమీ కాదని, ఫోన్లో నుంచి డిలీట్ చేసుకోవచ్చని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ యాప్తో పౌరుల గోప్యతపై ప్రభుత్వం నిఘా పెట్టిందని ప్రతిపక్షాలు, పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దీంతో సింధియా స్పష్టతనిచ్చారు.
News December 2, 2025
కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు: కవిత

విద్యా శాఖ స్వయంగా CM వద్దే ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం సిగ్గుచేటని జాగృతి చీఫ్ కవిత అన్నారు. గద్వాలలోని ST సంక్షేమ హాస్టల్లో కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆమె X వేదికగా స్పందించారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ చేతగానితనాన్ని, పేదింటి బిడ్డలంటే లెక్కలేనితనాన్ని బయటపెట్టిందన్నారు.
News December 2, 2025
కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు: కవిత

విద్యా శాఖ స్వయంగా CM వద్దే ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం సిగ్గుచేటని జాగృతి చీఫ్ కవిత అన్నారు. గద్వాలలోని ST సంక్షేమ హాస్టల్లో కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆమె X వేదికగా స్పందించారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ చేతగానితనాన్ని, పేదింటి బిడ్డలంటే లెక్కలేనితనాన్ని బయటపెట్టిందన్నారు.


