News April 5, 2024

HYD: మల్కాజిగిరిలో పోస్టర్ల కలకలం 

image

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోస్టర్లు ప్రత్యక్షమై కలకలం రేపుతున్నాయి. పోస్టర్లలో నాన్ లోకల్ వర్సెస్ లోకల్ అంటూ ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటలను కలవాలంటే 166 కిలోమీటర్లు ప్రయాణం చేసి హుజూరాబాద్ వెళ్లాలని.. కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిని కలవాలంటే 59 కిలోమీటర్లు ప్రయాణం చేసి చేవెళ్ల వెళ్లాలని.. కానీ BRS అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ అని ఇక్కడే మనతోనే ఉంటారని పోస్టర్లలో రాశారు. 

Similar News

News November 30, 2025

చేవెళ్ల, కందుకూరులో నేటి నుంచి రెండో విడత నామినేషన్లు

image

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, కందుకూరు రెవెన్యూ డివిజన్లలోని 7 మండలాల్లో ఆదివారం నుంచి రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శంకర్‌పల్లి, చేవెళ్ల, ఆమనగల్లు సహా 7 మండలాల్లోని 178 పంచాయతీ, 1,540 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 2 తుది గడువు. ఉపసంహరణ 6న కాగా, పోలింగ్, కౌంటింగ్ 14న జరుగుతాయని అధికారులు వెల్లడించారు.

News November 30, 2025

రంగారెడ్డి జిల్లాలో ప్రజావాణి రద్దు

image

రంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ C.నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందన్నారు. జిల్లా ప్రజలు, పిర్యాదుదారులు సహకరించాలని కలెక్టర్ కోరారు.

News November 30, 2025

రంగారెడ్డి: అన్నా.. ఏమైనా డబ్బులు ఉన్నాయా!

image

రంగారెడ్డి జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందుకోసం వ్యవసాయ భూమి, ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. వచ్చేనెలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో నగదు సమకూర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. కాగా, అన్నా.. సర్పంచ్ రిజర్వేషన్ కలిసొచ్చింది.. ఏమైనా డబ్బులు ఉన్నాయా..! నేను గెలిస్తే నీవు గెలిచినట్టే అని పంచాయతీ పోటీదారులు అప్పులు చేస్తున్నారు.