News April 5, 2024

HYD: మల్కాజిగిరిలో పోస్టర్ల కలకలం

image

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోస్టర్లు ప్రత్యక్షమై కలకలం రేపుతున్నాయి. పోస్టర్లలో నాన్ లోకల్ వర్సెస్ లోకల్ అంటూ ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటలను కలవాలంటే 166 కిలోమీటర్లు ప్రయాణం చేసి హుజూరాబాద్ వెళ్లాలని.. కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిని కలవాలంటే 59 కిలోమీటర్లు ప్రయాణం చేసి చేవెళ్ల వెళ్లాలని.. కానీ BRS అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ అని ఇక్కడే మనతోనే ఉంటారని పోస్టర్లలో రాశారు.

Similar News

News July 7, 2025

HYD: యుక్త వయసులో మెదడుపై ప్రభావం!

image

యుక్త వయసులోనే యువత మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. ఓ వైపు డ్రగ్స్, మద్యం మత్తు, మరోవైపు సైబర్ మోసం, ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకోవడంతో ఒక్కోసారి జీవితంపై విరక్తి చెంది మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో తల తిరగడం, ఒళ్లు వణికే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి లక్షణాలు కలిగిన 18 మందికి పైగా ఈ నెలలో ఎర్రగడ్డ, ఉస్మానియా వైద్యులను సంప్రదించడం ఆందోళనకరం.

News July 6, 2025

HYD: డ్రంక్‌ అండ్ డ్రైవ్.. 105‌ మందిపై చర్యలు

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ పరిధిలో పట్టుబడ్డ 105 మందిని నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారణలో రూ.2.39 లక్షల జరిమానా విధించబడింది. కొందరికి జైలు శిక్షలు కూడా విధించారు. ఈ చర్యలు ప్రజల్లో ట్రాఫిక్ అవగాహన పెంపొందించేందుకు చేపట్టినవని సెంట్రల్ జోన్ ట్రాఫిక్ ACP మోహన్ కుమార్ తెలిపారు.

News July 6, 2025

లోకేశ్‌తో KTR పదే పదే చర్చలు: సామ రామ్మోహన్

image

సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లకు కేటీఆర్ ప్రతిసవాళ్లు విసరడం హాస్యస్పదమని TPCC మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద రేపు చర్చకు రావాలని KTRకు సవాల్ విసిరారు. రైతుల సంక్షేమంపై మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. లోకేశ్‌తో కేటీఆర్ పదే పదే రహస్య మంతనాలు జరపడంపై కూడా సమాధానం చెప్పాలని సామ రామ్మోహన్ డిమాండ్ చేశారు.