News April 5, 2024
HYD: మల్కాజిగిరిలో పోస్టర్ల కలకలం
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోస్టర్లు ప్రత్యక్షమై కలకలం రేపుతున్నాయి. పోస్టర్లలో నాన్ లోకల్ వర్సెస్ లోకల్ అంటూ ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటలను కలవాలంటే 166 కిలోమీటర్లు ప్రయాణం చేసి హుజూరాబాద్ వెళ్లాలని.. కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిని కలవాలంటే 59 కిలోమీటర్లు ప్రయాణం చేసి చేవెళ్ల వెళ్లాలని.. కానీ BRS అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ అని ఇక్కడే మనతోనే ఉంటారని పోస్టర్లలో రాశారు.
Similar News
News January 22, 2025
HYD: మాజీ ఎమ్మెల్యేపై కేసు.. KTR రియాక్షన్
దాడిచేసింది గాక తిరిగి మాజీ ఎమ్మెల్యేపైనే కేసు పెట్టారు, ఇదీ కాంగ్రెస్ అరాచక పాలన తీరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. మంగళవారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన రసాభాసలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ పేరుకే ప్రజాపాలన కానీ దివ్యాంగ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదన్నారు.
News January 22, 2025
VIRAL: MLA పద్మారావు లేటెస్ట్ ఫొటో
సికింద్రాబాద్ MLA T.పద్మారావు గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పనులతో ఆయన ఆదివారం డెహ్రాడూన్ వెళ్లారు. ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు స్టంట్ వేసి డిశ్చార్జ్ చేశారని తెలిపారు. అయితే, డెహ్రాడూన్లోని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పద్మారావు కోలుకున్నారని, ఆస్పత్రిలో కుటుంబీకులతో దిగిన ఫొటోలను బీఆర్ఎస్ శ్రేణులు షేర్ చేస్తున్నాయి.
News January 22, 2025
HYDలో ఒకే ఒక పోస్ట్.. శాలరీ రూ. 1,25,000
జర్నలిజంలో అనుభవం ఉన్నవాళ్లకు ఇదొక గొప్ప అవకాశం. నెలకు రూ. 80 వేల నుంచి రూ. 1,25,000 వేతనం పొందవచ్చు. ఇటీవల ప్రసార భారతి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ బేసిక్ కింద హైదరాబాద్లో సీనియర్ కరస్పాండెంట్ ఒక పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ, PG డిప్లొమా, MCJ చేసినవారు అర్హులు. మీడియా రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తు లాస్ట్ డేట్: JAN 31.
LINK: https://prasarbharati.gov.in
SHARE IT