News January 30, 2025

HYD: మహాత్మా గాంధీకి నివాళులర్పించిన సీపీ

image

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ జోయల్ డేవిస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 11, 2025

రంగారెడ్డిలో BRS vs కాంగ్రెస్

image

రంగారెడ్డి జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో నందిగామ, జిల్లేడ్ చౌదరిగూడం, కొత్తూరు మండలాలు బోణి కొట్టాయి. నందిగామ (M) బుగ్గోనితండా సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన బుగ్గసాలయ్య, జిల్లేడ్‌(M) ముష్టిపల్లి సర్పంచ్‌గా BRS బలపరిచిన జంగయ్య గెలుపొందారు. దీంతో BRS, కాంగ్రెస్ మధ్య ఫైట్ టఫ్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్తూరు (M) మల్లాపూర్ తండా సర్పంచ్‌గా ఇండిపెండెంట్‌ మీనాక్షి దశరథ్ గెలుపొందారు.

News December 11, 2025

రంగారెడ్డి: 6 ఏకగ్రీవం.. 168 GPలకు ఎన్నిక

image

రంగారెడ్డి జిల్లాలో నేడు సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా జిల్లాలోని 7 మండలాల పరిధి 174 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 6 GPలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో గురువారం 168 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం ఒంటిగంటతో పోలింగ్ ముగుస్తుంది. మధ్యాహ్నం 3 తర్వాత ఫలితాలు వస్తాయి. 530 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక 1340 వార్డులు ఉండగా.. ఇప్పటికే 190 ఏకగ్రీవం అయ్యాయి.

News December 7, 2025

రంగారెడ్డి జిల్లా నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్

image

చిల్కూర్‌లో SBI రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కింద యువతకి సీసీటీవీపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి రంగారెడ్డికి చెందిన 18- 45 ఏళ్లలోపు పురుషులు చిల్కూర్ SBI శిక్షణ కేంద్రంలో పేరును నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. డిసెంబర్ 9 నుంచి ఉచిత శిక్షణతో పాటు, ఉచితంగా హాస్టల్ వసతి, భోజన సౌకర్యం, యూనిఫామ్, టూల్ కిట్ ఇస్తారు. వివరాల కోసం 8500165190లో సంప్రదించగలరు.