News February 19, 2025
HYD: మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభ మేళా కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. భక్తుల సౌకర్యార్థం ఈ రైళ్లను ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్ నుంచి దానాపూర్, రక్సౌల్కు ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ రైళ్లు ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు అందుబాటులో ఉంటాయి. రైళ్ల రాకపోకల వివరాలు.. తేదీల కోసం పైన పేర్కొన్న పట్టికను చూడండి. ఈ రైళ్ల రాకపోకల సమాచారం కోసం SCR వెబ్సైట్ చూడొచ్చు.
Similar News
News October 25, 2025
సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్ స్పెషల్ రైళ్లు..!

రాబోయే పండుగలకు సంబంధించి సికింద్రాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 28, నవంబర్ 2న సికింద్రాబాద్ నుంచి ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 30, నవంబర్ 4వ తేదీల్లో హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రావడానికి అవకాశం కల్పిస్తున్నట్లు CPRO శ్రీధర్ పేర్కొన్నారు.
News October 25, 2025
HYD: ఉస్మానియా అండర్ గ్రౌండ్లో మార్చురీ నిర్మాణం

HYD గోషామహల్ గ్రౌండ్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ఉన్నతాధికారుల బృందం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఉస్మానియా నూతన ఆసుపత్రికి సంబంధించి పలు డిజైన్లను మార్చిన అధికారులు, భూగర్భంలో మార్చురీ నిర్మించాలని నిర్ణయించినట్లుగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు. ఈ మేరకు ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతున్నట్లు ప్రైమరీ ప్లానింగ్ రిపోర్టులో పేర్కొన్నారు.
News October 25, 2025
HYD: NIMSలో రూ.2,500కే డయాలసిస్..!

HYD పంజాగుట్ట పరిధిలోని NIMS హాస్పిటల్లో అధునాతన డయాలసిస్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఉన్నవారికి ఉచితం కాగా మిగతా వారికి తక్కువ ఖర్చులోనే అందిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 5 షిఫ్టుల్లో దాదాపు 1,000 మందికి డయాలసిస్ చేస్తున్నారు. సుమారు 120 డయాలసిస్ యంత్రాలు అందుబాటులో ఉండగా, ఆరోగ్యశ్రీ లేనివారికి రూ.2,500కే డయాలసిస్ చేస్తున్నారు.


