News March 3, 2025
HYD: మహిళలపై అత్యాచారం.. వారే అధికం..!

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాది నమోదైన అత్యాచార కేసుల్లో అత్యధికులు స్నేహితులు ఉండగా, తర్వాత సహోద్యోగులు, సంరక్షకులు, పని వాళ్లు, డ్రైవర్లు, బంధువులు ఉన్నారు. మరోవైపు ఇరుగు పొరుగువారు, కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా తేలింది. వీటి కోసం ఉమెన్ సేఫ్టీ సస్పెక్ట్ రిజిస్ట్రీ మైంటైన్ చేస్తున్నారు. దీనిద్వారా ఎప్పటికప్పుడు మహిళ యొక్క పరిస్థితి, వేధింపులను గూర్చి తెలుసుకోవడంతో పాటు నిఘా బెడుతున్నారు.
Similar News
News November 16, 2025
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం అనుమల్లి పేటకు చెందిన బొడ్డు శ్రీనివాస్(45) మృతి చెందాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. మిర్యాలగూడ వైపు బైక్పై వెళ్తున్న అతన్ని వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ కిందపడగా, ట్రాక్టర్ అతనిపై నుంచి వెళ్లింది. శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.
News November 16, 2025
హెల్తీ హ్యాపీ సొసైటీ స్థాపనే రాజ్యాంగ లక్ష్యం: సీఎం

AP: సోషల్ మీడియాను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దానిపై నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. హెల్తీ హ్యాపీ సొసైటీ స్థాపనే రాజ్యాంగ లక్ష్యమన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75ఏళ్లయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాబోయే రోజుల్లో భారత్ అన్ని రంగాల్లో నిపుణులను అందిస్తుందని, 2047 కల్లా ప్రపంచంలోనే ప్రభావవంతమైన దేశంగా మారుతుందని చెప్పారు.
News November 16, 2025
మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన: మంత్రి సీతక్క

మేడారంలో మాస్టర్ ప్లాన్ మేరకు జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ తదితరులతో కలిసి ఆదివారం పరిశీలించారు. జంపన్న వాగు వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వాగు మెట్లను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా జంపన్న వాగు వంతెనపై జాలి (రక్షణ కంచె) ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.


