News August 28, 2024
HYD: మహిళల బొమ్మలతో మగవారికి పరీక్ష.. ఫలితం

యువతులు, మహిళలను మగవారు ఏ విధంగా చూస్తున్నారన్న అంశంపై ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పరిశోధకులు బొమ్మలతో ప్రయోగాలు చేశారు. కుర్తాలు, చీరలను ఉపయోగించి కొన్ని బొమ్మలు, జీన్స్, షర్టులతో మరికొన్ని బొమ్మలను వేలమందికి పంపిణీ చేశారు. ముఖ కవళికలను తెలుసుకునేందుకే ‘ఐ ట్రాకింగ్ టెక్నాలజీ’ని ఉపయోగించారు. అయితే, ఎక్కువ మంది యువకులు అనుచితంగా లైంగిక శరీర భాగాలను చూసేందుకు ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడైంది.
Similar News
News December 4, 2025
HYD: గూగుల్మ్యాప్స్ ఫాలో అవుతున్నారా? జాగ్రత్త!

గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వెళ్తున్నారా? మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాత్రుళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. బోడుప్పల్లో ఓ వ్యక్తి తన వాహనంలో గుడ్డిగా దీన్ని నమ్మి బోడుప్పల్- పోచారం రూట్లో వెళ్లాడు. కుడివైపు మొత్తం మట్టి రోడ్డు ఉన్నప్పటికీ నావిగేషన్ అటువైపే చూపించింది. కొద్ది దూరం వెళ్లాక రోడ్డు లేకపోగా, భారీ గుంతలో పడ్డట్టు తెలిపారు. మీకూ ఇలా రాంగ్ డైరెక్షన్ చూపించిందా?
News December 4, 2025
HYD: పెరుగుతున్న కేసులు.. జాగ్రత్త!

HYDలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలు దాదాపు పదికిపైగా ఆస్పత్రులు అందిస్తున్నాయి. అయితే.. నెలకు 200 మంది వరకు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటున్నట్లు MNJ వైద్యులు గుర్తించారు. ఇన్ఫెక్షన్లు, ల్యూకేమియా, ఇన్ఫోమా, మైలోమా వంటి బ్లడ్ క్యాన్సర్లకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ పరిష్కారమని చెబుతున్నారు. ఊబకాయులు, పెరగుతున్న వయసు, పురుషుల్లో అధికంగా దీని లక్షణాలు కనిపిస్తున్నట్లు తేల్చారు.
News December 4, 2025
HYD: చెస్ ఆడతారా.. ₹22లక్షలు గెలుచుకోవచ్చు

తెలంగాణలో తొలి అతిపెద్ద ప్రైజ్మనీ చెస్ టోర్నమెంట్ డిసెంబర్ 20, 21 తేదీల్లో హిటెక్స్లో జరుగనుంది. ఎక్కారా చెస్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ ఓపెన్ ర్యాపిడ్ టోర్నమెంట్లో గెలుపొందితే ₹22.22 లక్షలు ప్రైజ్ మనీ సొంత చేసుకోవచ్చు. రాష్ట్రంలో భారీ స్థాయిలో జరుగుతున్న మొదటి చెస్ టోర్నీ అని నిర్వాహకులు తెలిపారు. SHARE IT


