News April 16, 2025
HYD: మహిళా భద్రత కోసం T-SAFE యాప్

మహిళా భద్రత కోసం యువత టెక్నాలజీని వినియోగిస్తున్నారని మహిళా భద్రత విభాగం డీజీ షికా గోయల్ తెలిపారు. T-సేఫ్ ఆండ్రాయిడ్ యాప్ను ఇప్పటి వరకు 42,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దీనివల్ల 36,263 ట్రిప్పులు నమోదు కాగా, 30% పైగా మూడు కమిషనరేట్ల పరిదివే, 65,000కుపైగా ఏజెంట్ కాల్స్ అందినట్లు పేర్కొన్నారు. మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్నామని, T-SAFE యాప్ మీరూ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 24, 2025
నిర్మాతలతో పవన్ కీలక భేటీ.. సినిమాల పూర్తికి హామీ?

ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో ఆయన చేయాల్సిన సినిమాల షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో పవర్ స్టార్ తాజాగా నిర్మాతలు ఏఎం రత్నం, మైత్రీమూవీ మేకర్స్, డీవీవీ దానయ్యతో భేటీ అయినట్లు సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేస్తానని, ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. తొలుత హరిహర వీరమల్లు, తర్వాత ఓజీ, చివరగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పూర్తవుతాయని టాక్.
News April 24, 2025
పసిడి ధర పెరుగుదలతో తగ్గిన అమ్మకాలు?

బంగారం ధరలు పెరగడం రిటైల్ మార్కెట్లో ఆభరణాల కొనుగోలుపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ధరలు హెచ్చువల్ల నగల అమ్మకాలు 9నుంచి 11శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. అయితే విక్రయ సంస్థల ఆదాయం మాత్రం 13నుంచి 15శాతం పెరగొచ్చని పేర్కొంది. 2024-25లో భౌగోళిక, రాజకీయ ఆందోళనలతో పసిడి ధరలు 25శాతం పెరిగాయి. ఫలితంగా రిటైలర్ల అమ్మకాలు 4-5శాతం తగ్గినట్లు నివేదిక తెలిపింది.
News April 24, 2025
అమరావతిలో ప్రధాని షెడ్యూల్ ఇదే

AP: ప్రధాని మోదీ మే 2వ తేదీన అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆరోజు మ.3 గంటలకు ఆయన గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. మ.3.30 గంటలకు అమరావతికి వచ్చి 1.1 కి.మీ మేర 15 నిమిషాలపాటు రోడ్ షో నిర్వహిస్తారు. తర్వాత అమరావతి పెవిలియన్ను సందర్శిస్తారు. సా.4 నుంచి 5 వరకు సభలో పాల్గొని తిరుగు ప్రయాణమవుతారు.