News January 12, 2025

HYD: మాజీ ఎంపీ మృతి పట్ల కేసీఆర్ సంతాపం

image

మాజీ ఎంపీ, సీనియర్ నేత మందా జగన్నాథం మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కృషిని, పార్టీకి ఆయన అందించిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. మందా జగన్నాథం మరణంతో తెలంగాణ సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయిందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. శోకతప్తులైన ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Similar News

News December 3, 2025

కోకాపేటలో ఎకరం రూ.131 కోట్లు

image

కోకాపేట్ నియోపోలిస్ భూముల‌ వేలం ముగిసింది. న‌గ‌రానికి చెందిన యూలా గ్రూప్ నాలుగు ఎక‌రాల ప్లాటును వేలంలో సొంతం చేసుకుంది. ఎక‌రానికి రూ.131 కోట్లు వెచ్చించింది. నియోపోలిస్ నుంచి గండిపేట్ వ్యూ క‌నిపిస్తుండ‌టంతో ఇక్క‌డి క‌మ్యూనిటీని డెవ‌ల‌ప్ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని, అందుకే ఈ నాలుగు ఎక‌రాలను ఆన్‌లైన్ వేలంలో యూలా గ్రూప్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.

News December 3, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు చార్టెడ్ ఫ్లైట్లలో ప్రముఖులు

image

గ్లోబల్ సమ్మిట్‌కు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథుల కోసం ఏకంగా 3 హెలిప్యాడ్‌లు సిద్ధం చేశారు. 50 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ హెలిప్యాడ్‌ల ద్వారా సుమారు 500 మంది ప్రముఖ అతిథులను రిసీవ్ చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఈవోలు, సినీ తారలు సహా పలువురు ప్రముఖులు చార్టెడ్ ఫ్లైట్లలో ఇక్కడికి చేరుకుంటారని అధికారులు Way2Newsకు తెలిపారు.

News December 3, 2025

MCA విద్యార్థులకు గమనిక.. పరీక్షలు ఎప్పుడంటే!

image

ఉస్మానియా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ MCA 3వ సెమిస్టర్ పరీక్షల తేదీని వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 4 నుంచి (గురువారం) పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. వీటితోపాటు బ్యాక్ లాగ పరీక్షలు కూడా నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల విభాగం అధిపతి ప్రొ.శశికాంత్ తెలిపారు.పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ కోసం ఉస్మానియా వెబ్ సైట్ http://www.oucde.net/ చూడవచ్చు.