News June 15, 2024
HYD: మాత్రలు వికటించి వ్యక్తి మృతి

మద్యం మత్తులో అధిక మొత్తంలో జ్వరం మాత్రలు వేసుకున్న వ్యక్తి మాత్రలు వికటించి మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలంలో జరిగింది. పోలీసుల ప్రకారం.. మెట్లకుంట గ్రామానికి చెందిన పల్లెగడ్డ మల్లేశ్(32) జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మద్యం మత్తులో ఇంట్లో ఉన్న జ్వరం మాత్రలను అధిక మొత్తంలో వేసుకున్నాడు. దీంతో మాత్రలు వికటించి మల్లేశ్ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 17, 2025
కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. వణికిపోతున్న హైదరాబాదీలు

హైదరాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. మారేడుపల్లిలో ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రత 11.2℃గా నమోదైంది. అటు బహదూర్పుర, బండ్లగూడ, చార్మినార్, నాంపల్లి, ఆసిఫ్నగర్, హిమాయత్నగర్ 13.2, తిరుమలగిరి 13.6, గోల్కొండ, ముషీరాబాద్ 14.4, షేక్పేట్ 15.2, అమీర్పేట్, ఖైరతాబాద్ 15.6, సికింద్రాబాద్లో 16℃గా నమోదైంది.
News November 17, 2025
HYD: ప్రైవేట్ ట్రావెల్స్పై అధికారుల కొరడా

రంగారెడ్డి జిల్లాలో రవాణాశాఖ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్పై కొరడా ఝుళిపిస్తున్నారు. ఓవర్లోడ్ వాహనాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 72 వాహనాలు సీజ్ చేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని, నిబంధనల ఉల్లంఘనచేస్తే ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఉప రవాణాశాఖాధికారి సదానందం ఆదేశాలపై చర్యలు కొనసాగిస్తున్నారు.
News November 17, 2025
HYD: iBOMMA రవి అరెస్ట్పై సీపీ ప్రెస్మీట్

iBOMMA రవి అరెస్ట్పై నేడు హైదరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి సినీ హీరోలు, నిర్మాతలు హాజరుకానున్నారు. ఇప్పటికే ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ పోలీసులు బ్లాక్ చేశారు. ‘ఐబొమ్మ’ను నడుపుతూ క్రికెట్ బెట్టింగ్ సైట్లు ప్రమోట్ చేసి రవి రూ.కోట్లు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. రవిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే.


