News February 27, 2026
HYD: మామూళ్ల మోజులో అధికారులు.. మెమోలు..!

శివారు కాలనీల్లో నీటికోసం జనం తపిస్తుంటే అధికారులు మాత్రం ట్యాంకర్ మాఫియాతో చేతులు కలిపారు. కావాలనే పైపులైన్లలో ప్రెజర్ తగ్గించి ప్రైవేట్ ట్యాంకర్లకు కొమ్ము కాస్తున్నారు. ప్రభుత్వ ఫిల్లింగ్ పాయింట్ల వద్దే తక్కువ ధరకు నీటిని నింపుకొని బయట రూ.2000 వరకు అమ్ముతూ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. ఈ దందాలో కిందిస్థాయి నుంచి పైదాకా వాటాలు వెళ్తున్నాయని తేలడంతో కొందరు అధికారులకు మెమోలు జారీ అయ్యాయి.
Similar News
News April 18, 2026
ఏప్రిల్ 18: చరిత్రలో ఈరోజు

* 1809: కవి, పండితుడు హెన్రీ డెరోజియా జననం
* 1880: రచయిత టేకుమళ్ల అచ్యుతరావు జననం
* 1958: విండీస్ మాజీ క్రికెటర్ మాల్కం మార్షల్ జననం
* 1859: స్వాతంత్ర్యసమరయోధుడు తాంతియా తోపే మరణం
* 1955: శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరణం(ఫొటోలో)
* 1980: సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ జననం
* ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం
* ప్రపంచ వారసత్వ దినోత్సవం
News April 18, 2026
కామారెడ్డి: డ్రంకెన్ డ్రైవ్.. 68 మందికి శిక్షలు

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 68 మందికి కోర్టు శిక్షలు విధించింది. ఇందులో 12 మందికి జైలు శిక్ష పడగా మొత్తం ₹82,700 జరిమానా విధించారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రాణాంతకమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
News April 18, 2026
కామారెడ్డి: డ్రంకెన్ డ్రైవ్.. 68 మందికి శిక్షలు

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 68 మందికి కోర్టు శిక్షలు విధించింది. ఇందులో 12 మందికి జైలు శిక్ష పడగా మొత్తం ₹82,700 జరిమానా విధించారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రాణాంతకమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.


