News August 26, 2024

HYD: మాయమైన చెరువు.. పోలీసులకు ఫిర్యాదు

image

హైదరాబాద్ శివారు తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని 8 ఎకరాల తుమ్మలచెరువు రాత్రికి రాత్రే మాయమైందని మహేశ్వరం బీజేపీ ఇన్‌ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ పహాడీ‌షరీఫ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. చెరువులను కబ్జాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైడ్రా కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News November 21, 2025

హైదరాబాద్ RRR రీ సర్వే తప్పనిసరి: కవిత

image

రంగారెడ్డి జిల్లాలో జాగృతి జనం బాటలో కవిత పర్యటన సాగుతుంది. RRR భూసేకరణలో అక్రమాలు జరిగాయని, రీ–సర్వే తప్పనిసరి అని ఆమె డిమాండ్ చేశారు. చెరువుల కబ్జాలు, ఆర్ఆర్ఆర్ ఆలైన్‌మెంట్ మార్పుల పెద్దల కోసం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఒక్క న్యాయం పెద్దలకు మరో న్యాయమా? అంటూ కవిత నిలదీశారు.

News November 21, 2025

HYD: నాగోల్‌లో విషాదం.. దంపతుల సూసైడ్

image

నగరంలో విషాద ఘటన వెలుగుచూసింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం శివారులో దంపతులు సూసైడ్ చేసుకున్నారు. అప్పుల బాధతో మల్లేశ్, సంతోష పురుగుల మందు తాగారు. అక్కడికక్కడే భార్య మృతి చెందగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త చనిపోయారు. శుక్రవారం ఉదయం చైతన్యపురి పీఎస్‌లో వారి కుమారుడు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

News November 21, 2025

HYD: నాగోల్‌లో విషాదం.. దంపతుల సూసైడ్

image

నగరంలో విషాద ఘటన వెలుగుచూసింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం శివారులో దంపతులు సూసైడ్ చేసుకున్నారు. అప్పుల బాధతో మల్లేశ్, సంతోష పురుగుల మందు తాగారు. అక్కడికక్కడే భార్య మృతి చెందగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త చనిపోయారు. శుక్రవారం ఉదయం చైతన్యపురి పీఎస్‌లో వారి కుమారుడు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.