News March 15, 2025
HYD: మారనున్న యూనివర్సిటీ పేరు.. హిస్టరీ ఇదే!

నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుపై నేడు సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టనున్నట్లు సమాచారం. కాగా సరిగ్గా నలభై ఏళ్ల క్రితం 1985లో తెలుగు యూనివర్సిటీని NTR ప్రారంభించారు. దీనికే 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా నామకరణం చేశారు.
Similar News
News February 17, 2026
వికసిత్ భారత్కు బడ్జెట్-2026 బలమైన పునాది: పురందేశ్వరి

2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కేంద్ర బడ్జెట్-2026 దీర్ఘకాలిక పునాది వేస్తుందని ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. మంగళవారం రాజమండ్రిలో నిర్వహించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న దేశాభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
News February 17, 2026
ఫుడ్ సేఫ్టీపై హనుమకొండ కలెక్టర్ కీలక ఆదేశాలు

జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో ఆహార నాణ్యతపై రాజీ పడొద్దని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. వారానికి కనీసం 3రోజులు మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా తాగునీటి శుద్ధి, వంటగదుల పరిశుభ్రతను నిశితంగా పరిశీలించాలని సూచించారు. స్ట్రీట్ వెండర్లు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు.
News February 17, 2026
సంగారెడ్డి: ‘బెస్ట్ అవైలబుల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి’

బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ప్రైవేట్ పాఠశాలలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఐదు సంవత్సరం నుంచి 10వ తరగతిలో 90 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు మాత్రమే అర్హులని చెప్పారు. మార్చి 25వ తేదీ వరకు కలెక్టర్ కార్యాలయంలోని తమ కార్యాలయంలో ప్రవేట్ పాఠశాలలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 83285 08067 నంబర్కు సంప్రదించాలన్నారు.


