News March 1, 2025
HYD: మార్చి 1.. పెరిగిన టికెట్ ధరలు

HYD బహదూర్పురాలోని నెహ్రూ జూపార్క్ ఎంట్రీ టికెట్ ధర పెరిగింది. Adults రూ. 100, Children రూ. రూ. 50 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. సఫారీ, ట్రెయిన్ రైడ్, ఫిష్ అక్వేరియం ఎంట్రీ టికెట్ ధరలు కూడా పెరిగాయి. సమ్మర్లో టూరిస్టులు అధికంగా జూ పార్క్కు వస్తుంటారు. అనుగుణంగా అధికారులు పార్క్లో ఏర్పాట్లు చేస్తున్నారు.https://nzptsfd.telangana.gov.in వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
SHARE IT
Similar News
News December 13, 2025
TRENDING: అబిడ్స్ సండే ‘మార్కెట్’

ఆన్లైన్ పుస్తకాల హడావిడిలోనూ హైదరాబాద్ యువత ‘పాత పుస్తకాల’పైనే మోజు పెంచుకుంటోంది. డిజిటల్ విప్లవాన్ని ధిక్కరిస్తూ, ప్రతి ఆదివారం అబిడ్స్ ఫుట్పాత్లపై అరుదైన పుస్తకాలను వేటాడుతున్నారు. 60 ఏళ్ల నాటి క్లాసిక్లు, వింటేజ్ మ్యాగజైన్లు, సాహిత్యం కోసం వీరు ఇక్కడికి పోటెత్తుతున్నారు. కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యే ఈ అద్భుతమైన సంప్రదాయం నేటి యువతలో ట్రెండింగ్గా మారుతోంది. ఇక్కడ ధరలు కూడా తక్కువే.
News December 13, 2025
ఉప్పల్లో ఫుట్బాల్ మ్యాచ్.. CM, మెస్సీ ఆడేది అప్పుడే!

సింగరేణి RR-9 వర్సెస్ అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ మధ్య ఉప్పల్లో మ్యాచ్ షురూ అయ్యింది. 7v7 ఎగ్జిబిషన్/సెలిబ్రిటీ మ్యాచ్ జరగుతుంది. ఈ మ్యాచ్ చివర్లో తెలంగాణ CM రేవంత్ రెడ్డి కూడా గ్రౌండ్లోకి దిగి మెస్సీతో కలిసి ఆడనున్నారు. అంతకుముందు మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కలిసి చిన్నపిల్లలకు ఫుట్బాల్ క్లినిక్ నిర్వహించి, వాళ్లకు టెక్నిక్స్ నేర్పిస్తారు. ఫుట్బాల్ ఫ్యాన్స్కు ఇది పండగే.
News December 13, 2025
మరో అరగంటలో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ!

హైదరాబాద్లో మెస్సీ మేనియా నడుస్తోంది. మరో అరగంటలో ఆయన ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి రానున్నట్లు సమాచారం. దీంతో వందలాది మంది ఫుడ్ బాల్ క్రీడాకారులు, అభిమానులు పాస్లు తీసుకొని స్టేడియానికి పోటెత్తారు. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు నడుమ స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. కొందరేమో మెస్సీకి అభివాదం చెప్పేందుకు స్టేడియం బయట బారులు తీరారు.


