News March 1, 2025

HYD: మార్చి 1.. పెరిగిన టికెట్ ధరలు

image

HYD బహదూర్‌పురాలోని నెహ్రూ జూపార్క్ ఎంట్రీ టికెట్ ధర పెరిగింది. Adults రూ. 100, Children రూ. రూ. 50 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. సఫారీ, ట్రెయిన్ రైడ్, ఫిష్ అక్వేరియం ఎంట్రీ టికెట్ ధరలు కూడా పెరిగాయి. సమ్మర్‌లో టూరిస్టులు అధికంగా జూ పార్క్‌కు వస్తుంటారు. అనుగుణంగా అధికారులు పార్క్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు.https://nzptsfd.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
SHARE IT

Similar News

News October 23, 2025

BIG BREAKING: బంజారాహిల్స్‌లో వ్యభిచారం.. అరెస్ట్

image

బంజారాహిల్స్ రోడ్ నంబర్‌ 12లోని ఓ హోటల్లో నిర్వహిస్తున్న సెక్స్‌ రాకెట్‌ను కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (వెస్ట్ జోన్), బంజారాహిల్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ దాడిలో నిర్వాహకుడు, సెలూన్ వ్యాపారి మహమ్మద్ షరీఫ్‌, కర్నూలుకు చెందిన ఏడుగురు కస్టమర్లు, హోటల్ రిసెప్షనిస్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మందిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.

News October 23, 2025

జూబ్లీహిల్స్ బైపోల్‌లో నో బ్యాలెట్.. ఓన్లీ EVM!

image

EVMల ద్వారానే జూబ్లీహిల్స్ బైపోల్ నిర్వహిస్తామని HYD జిల్లా ఎన్నికల అధికారి RV కర్ణన్ స్పష్టం చేశారు. నామినేషన్ల పరిశీలన పూర్తి చేసిన అనంతరం 81 మంది అభ్యర్థులకు ఆమోదం లభించింది. రేపు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇంకెవరైనా ఉపసంహరణకు వెళితే అభ్యర్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అయితే, 64 మందికి పైగా పోటీలో ఉంటే M3 ఈవీఎంలు ఉపయోగించనున్నారు.

News October 23, 2025

సికింద్రాబాద్: ప్రయాణికులతో ‘పరిచయ కార్యక్రమం’

image

తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఆర్టీసీలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. డీఎం సరితా దేవి ఆదేశంతో ఈరోజు కండక్టర్, వీబీఓ గోపు శ్రీనివాస్ సికింద్రాబాద్ టు వర్గల్ బస్ ప్రయాణికులతో పరిచయం చేసుకున్నారు. రూట్ వివరాలు, సమయ పట్టిక, ఆర్టీసీ ఆఫర్స్, సేవలు, సోషల్ మీడియా, సైట్లపై వివరించారు.