News February 18, 2025
HYD: మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలి: సీఎం

గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీలో జరుగుతున్న షీల్డ్ 2025 సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలని, ఒకప్పుడు ఇంట్లో చొరబడి మాత్రమే దోపిడీలు చేసేవారని, ఇప్పుడు దొంగలు ఎక్కడో ఉండి మన సొమ్ము దోచేస్తున్నారన్నారు. పోలీసు వ్యవస్థ దేశం మొత్తం ఒక యూనిట్గా పని చేస్తేనే సైబర్ నేరాలను అరికట్టగలమన్నారు.
Similar News
News December 4, 2025
HYD: వెల్డింగ్ ట్రైనింగ్.. సర్టిఫికెట్

మాదాపూర్ NAC- జాతీయ భవన నిర్మాణ సంస్థలో ఇంటర్నేషనల్ స్కిల్డ్ వర్కర్స్ అప్గ్రేడేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. వెల్డింగ్ రంగంలో ఉద్యోగం ఉన్నవారికి 15 రోజులపాటు రూ.15,000 ఫీజుతో శిక్షణ ఇస్తారు. భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తారు. ఉద్యోగం లేనివారికి 3 నెలల వెల్డింగ్ శిక్షణను రూ.14,700 ఫీజుతో అందిస్తారు. వారికి నెలకు రూ.6,000కు భోజనం, హాస్టల్ సదుపాయం ఉంటుందన్నారు.
News December 4, 2025
WGL: తొలి విడతలో 52 పంచాయతీలు ఏకగ్రీవం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో 52 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో వరంగల్ జిల్లాలో 10 (రాయపర్తి 5, పర్వతగిరి 3, వర్ధన్నపేట 2), ములుగు జిల్లాలో 9, మహబూబాబాద్ జిల్లాలో 9, భూపాలపల్లి జిల్లాలో 9, జనగామ జిల్లాలో 10 (రఘునాథపల్లి 5), హనుమకొండ జిల్లాలో 5 పంచాయతీలు ఉన్నాయి.
News December 4, 2025
వెల్దుర్తి: ఎండ్రకాయల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

వెల్దుర్తి హల్దీవాగులో ఎండ్రకాయ వేటకు వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన హస్తాల్ పూర్ శివారులో చోటు చేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దులాగా చెందిన జానపాటి సాయిలు, ఆవుల దుర్గయ్య అలియాస్ శంకర్ (42) గ్రామ శివారులోని హల్దీవాగుకి ఎండ్రకాయల వేటకు వెళ్లారు. ఇరువురు ఎండ్రకాయలు పట్టుకొని బయటకు వస్తుండగా, దుర్గయ్య నీటిలో ఒక్కసారిగా మునిగి పోయాడు. దీంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.


