News February 18, 2025
HYD: మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలి: సీఎం

గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీలో జరుగుతున్న షీల్డ్ 2025 సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలని, ఒకప్పుడు ఇంట్లో చొరబడి మాత్రమే దోపిడీలు చేసేవారని, ఇప్పుడు దొంగలు ఎక్కడో ఉండి మన సొమ్ము దోచేస్తున్నారన్నారు. పోలీసు వ్యవస్థ దేశం మొత్తం ఒక యూనిట్గా పని చేస్తేనే సైబర్ నేరాలను అరికట్టగలమన్నారు.
Similar News
News July 11, 2025
కరీంనగర్: ‘రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయండి’

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జులై 12, 13 తేదీల్లో జరిగే రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్ మాట్లాడుతూ.. తరగతుల్లో విద్యార్థి సమస్యలు, జాతీయవాదం, దేశభక్తి తదితర అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. ప్రారంభ ఉపన్యాసాన్ని గుమ్మడి నరసయ్య ఇవ్వనున్నారు.
News July 11, 2025
రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదు: ఎంపీ

సీఎం రేవంత్ రెడ్డితో చర్చించే స్థాయి కేటీఆర్కు లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ సెంటిమెంట్ను తెరమీదకు తెస్తున్నారని పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణకు మాత్రమే లాభం జరిగిందని, దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ‘కేటీఆర్కు నిజంగా దమ్ముంటే.. కేసీఆర్ దగ్గర నుంచి ప్రతిపక్ష హోదాను తెచ్చుకోవాలి’ అంటూ సవాలు విసిరారు.
News July 11, 2025
కొత్తగూడెం: మొన్న గల్లంతు.. నేడు మృతదేహం లభ్యం.!

మణుగూరు మండలం బాంబే కాలనీ సమీపంలోని రేగుల గండి చెరువులో సింగరేణి ఉద్యోగి సుంకరి శ్రీనివాస్ స్నేహితులతో ఈతకు వెళ్లి బుధవారం గల్లంతయ్యారు. గురువారం NDRF బృందాలు, రెస్క్యూ టీం సాయంతో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. శ్రీనివాస్ మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.