News February 3, 2025

HYD: మీ పిల్లల్లో ఇలాంటి ప్రవర్తన గుర్తిస్తే జాగ్రత్త..!

image

మత్తుపదార్థాల వినియోగం యువతలో వేగంగా పెరుగుతుండటంతో రాచకొండ సీపీ సుధీర్ బాబు తల్లిదండ్రులకు ముఖ్యమైన హెచ్చరికను జారీ చేశారు. రేవ్‌పార్టీలు, అనుమానాస్పద మాత్రలు, రహస్య ప్రవర్తన వంటి ప్రారంభ లక్షణాలను గమనించడం వల్ల యువతను మత్తుపదార్థాల మాయాజాలం నుంచి కాపాడవచ్చన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడంతో సమస్యను ముందే గుర్తించి నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News October 14, 2025

మెదక్: కొడుకు మృతి.. మనస్తాపంతో తల్లి..

image

మెదక్(D) నిజాంపేటలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు మృతి చెందాడనే మనస్తాపంతో తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన జ్యోతి(41) బతుకుదెరువు కోసం మహబూబ్‌నగర్ వెళ్లారు. అక్కడ ఆమె కొడుకు అనిల్ నెల రోజుల క్రితం పిట్స్ రావటంతో ప్రమాదవశాత్తు వాగులో పడి చనిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన జ్యోతి ఇంట్లో ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు SI రాజేశ్ కేసు నమోదు చేశారు.

News October 14, 2025

పశువులు, గొర్రెల, మేకల ఎరువుతో లాభాలు

image

ఒక టన్ను పశువుల ఎరువును పొలంలో వేస్తే 5-15KGల నత్రజని, 4-8KGల భాస్వరం, 5-19 KGల పొటాష్ పొలానికి అందుతాయి. గొర్రెలు, మేకల ఎరువు టన్ను వేస్తే 5-7KGల నత్రజని, 4-6KGల భాస్వరం, 8-10KGల పొటాష్ భూమికి అందుతుంది. పొలంలో సేంద్రియ పదార్థం పెరగడంతో పాటు భూమి గుల్లబారి పంటకు పోషకాలు తొందరగా అందుతాయి. గొర్రెల మందలను ఖాళీ పొలంలో కడితే వాటి మలమూత్రాలతోనూ భూసారం పెరుగుతుంది.

News October 14, 2025

HYD: ఏడుగురు నేరస్థుల అరెస్ట్

image

HYD సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఆరుగురు ప్రాపర్టీ నేరస్థులు, ఒక బాల నేరస్థుడు అరెస్ట్‌ అయ్యాడు. మొత్తం 6 కేసులు డిటెక్ట్ చేసి, రూ.7 లక్షల విలువైన ఆస్తులు రికవరీ చేశారు. ఒక దొంగిలించిన టూ-వీలర్, 10 మొబైల్ ఫోన్లు, ఒక ఆటోను సీజ్ చేశారు. నిందితులు నగరంలో మొబైల్‌ఫోన్‌, టూ-వీలర్‌ దొంగతనాలకు పాల్పడుతున్న హ్యాబిట్యువల్ ఆఫెండర్స్ అని పోలీసులు తెలిపారు.