News August 18, 2024

HYD: మూలన పడ్డ వాటర్ ఏటీఎంల పరిస్థితి ఏంటి..?

image

GHMC ఆరేళ్ల క్రితం ఎల్బీనగర్, అమీర్‌పేట్, పాతబస్తీ, ఖైరతాబాద్, మలక్‌పేట్, హైటెక్ సిటీ, మియాపూర్, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. ఒక్కోదానికి రూ.6.50 లక్షలు వెచ్చించి, నీటి శుద్ధి పరికరాలను కొనుగోలు చేసింది. రూ.5కు 10 లీటర్ల చొప్పున మొదట నీరు అందించినా.. ప్రస్తుతం ఉప్పల్ సహా అనేక చోట్ల మూలన పడ్డాయనే విమర్శలు వస్తున్నాయి.

Similar News

News November 16, 2025

HYD: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎస్ సమీక్ష .

image

డిసెంబర్ 8- 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై ఫ్యూచర్ సిటీ, ముచ్చర్లలో భారీ ఏర్పాట్లపై సీఎస్ రామకృష్ణరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమ్మిట్‌లో తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ విడుదల చేయనున్నారు. 2035నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంమని సీఎస్ రామకృష్ణరావు తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంపై దృష్టి పెట్టామని, 70 థీమాటిక్ స్టాల్స్ తెలంగాణ అభివృద్ధి ప్రతిరూపమన్నారు.

News November 16, 2025

HYD: స్మార్ట్‌ఫోన్‌ అతి వినియోగం.. సమస్యలు ఇవే!

image

స్మార్ట్‌ఫోన్‌ను అతిగా ఉపయోగించడం వల్ల తీవ్రమైన భుజం, మెడ, వెన్నునొప్పి కేసులు పెరుగుతున్నాయని NIMS వైద్యులు చెబుతున్నారు. చిన్న వయస్సులోనే స్పాండిలైటిస్ వంటి ఆరోగ్య సమస్యలు బయట పడుతున్నాయని హెచ్చరించారు. గంటల తరబడి ఫోన్‌లో తల వంచడం వలన నాడులు, కండరాలపై ఒత్తిడి పెరిగి దీర్ఘకాలిక నొప్పులు వస్తున్నాయని, ప్రతి 30 నిమిషాలకోసారి విరామం తీసుకోవడం మంచిదని సూచించారు.
SHARE IT

News November 16, 2025

జూబ్లీహిల్స్ గెలుపు‌తో ప్రజాపాలనకు 5 స్టార్ రేటింగ్: చనగాని

image

జూబ్లీహిల్స్ గెలుపు ప్రజాపాలనకు 5 స్టార్ రేటింగ్ లాంటిదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ అన్నారు. శనివారం గాంధీ‌భవన్‌లో ఆయన మాట్లాడారు. ‘రానున్న రోజుల్లో యువతకు అధిష్ఠానం పెద్దపీట వేస్తుంది. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల నమ్మకం పెరిగింది. 75 ఏళ్ల రాష్ట్రంలో ఉద్యమకారుల పాడే మోసిన సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో ఉంటారు. కేటీఆర్ డ్రామా, డీజే ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు’ అని పేర్కొన్నారు.