News February 11, 2025
HYD: మూసీకి రూ.37.50 కోట్లు కేటాయింపు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739249608432_1212-normal-WIFI.webp)
మూసీ నది అభివృద్ధి సంస్థకు రూ.37.50 కోట్లు కేటాయిస్తూ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ ప్రక్షాళన అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులను తరలించేందుకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 1,500 కుటుంబాలను గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.25,000 అందించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 12, 2025
HYD: 9000113667 ఈ నంబర్కు కాల్ చేయండి..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739291367747_52296546-normal-WIFI.webp)
చెరువుల్లో మట్టి పోస్తున్నవారి సమాచారాన్ని తెలియజేయాలని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోను నంబర్ను 9000113667 కేటాయించింది. అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, మట్టిని సర్దుతున్న జేసీబీల వీడియోలను కూడా పంపించాలని కోరింది. ఇప్పటి వరకు 48 కేసులు కాగా రాత్రీపగలు నిఘా ఉంచి నెల రోజుల్లో 31 లారీలను పట్టుకున్నామని తెలిపింది.
News February 12, 2025
17వ తేదీ నుంచి ఓయూ సెల్ట్ తరగతులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739265604659_52136336-normal-WIFI.webp)
ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో ఈ నెల 17వ తేదీ నుంచి తరగతులను నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సవిన్ సౌడ తెలిపారు. రెండు నెలల ఈ కోర్సుకు ప్రతిరోజూ ఉదయం ఆరున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న వారు 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 79899 03001, 98497 52655 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
News February 12, 2025
గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ శ్రవణ్ మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739293539915_718-normal-WIFI.webp)
ఈనెల 9న సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని కామాక్షి సిల్క్స్ క్లాత్ షోరూమ్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన శ్రవణ్ కుమార్(37) మంగళవారం తెల్లవారుజామున గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మృతిచెందాడు. శ్రవణ్ 98 శాతం కాలిన గాయాలతో ఆదివారం గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మార్కెట్ పీఎస్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు.