News August 17, 2024

HYD: మూసీ వెంట 12,182 అక్రమణల గుర్తింపు!

image

HYD నగరంలో మూసీ ప్రక్షాళన వడివడిగా సాగుతోంది. ముఖ్యంగా ఆక్రమణలను గుర్తించిన అధికారులు ప్రత్యేక యాప్‌లో వివరాలు పొందుపరిచారు. గండిపేట నుంచి ఘట్‌కేసర్ వరకు ఆక్రమణలను గుర్తించారు. రాజేంద్రనగర్, ఆసిఫ్‌నగర్, గోల్కొండ, బహదూర్‌పుర, నాంపల్లి, అంబర్‌పేట, ఉప్పల్‌లో ఎక్కువ శాతం ఆక్రమణలు ఉన్నట్లు 33 బృందాలు గుర్తించాయి. ఇప్పటి వరకు అన్ని మండలాల్లో కలిపి 12,182 అక్రమణాలు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు.

Similar News

News November 19, 2025

HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్‌

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

News November 18, 2025

శంషాబాద్ నుంచి సౌదీకి ప్రత్యేక విమానం

image

సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాద ఘటన బాధితుల కోసం ప్రభుత్వం శంషాబాద్ నుంచి సౌదీకి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని గుర్తించి, అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మృతుల రక్త సంబంధికులను ఈరోజు రాత్రి 8.30 గంటలకు నాంపల్లి హజ్ హౌస్ నుంచి సౌదీకి పంపనున్నారు.

News November 18, 2025

శంషాబాద్‌: గర్భంలోనే కవలలు మృతి.. భర్త ఆత్మహత్య

image

భార్య గర్భంలోని కవలలు మృతిచెందారనే దుఃఖంతో శంషాబాద్‌లోని సామ ఎన్‌క్లేవ్‌లో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆతహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం.. కర్ణాటకకు చెందిన ముత్యాల విజయ్ భార్య శ్రావ్య 8 నెలల గర్భిణీ. కవలల మరణ వార్త తెలిసి విజయ్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.