News March 29, 2024
HYD: మూసీ సుందరీకరణకు మాస్టర్ PLAN
HYD మూసీ నది వెంట 125 చదరపు కిలోమీటర్ల మేర ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం కానుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జోన్లను నిర్ణయిస్తూ ఆరు నెలల్లో సిద్ధం చేయాలని MRDCLను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. మూసీ డెవలప్మెంట్ కోసం రూ.5,813 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. మూసీకి ఇరువైపులా సుమారు 1KM మేర మాస్టర్ ప్లాన్ పరిధిలోకి రానుంది.
Similar News
News September 30, 2024
HYD: నేడు అత్తాపూర్కు కేటీఆర్ రాక
మూసీ నిర్వాసితులను పరామర్శించడానికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం అత్తాపూర్లోని లక్ష్మీనగర్ కాలనీ, నందనవనం అపార్ట్మెంట్స్కు రానున్నారని ఆ పార్టీ నేత కొలను సుభాష్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులను పరామర్శించి వారితో మాట్లాడతారని పేర్కొన్నారు.
News September 30, 2024
HYD: విదేశాల్లో చదువుకునేందుకు BEST CHANCE
మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీ విద్యా పథకం కింద అర్హులైన HYD, RR, MDCL, VKBలోని బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబర్ 15లోగా ఈపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. 35 ఏళ్లు, ఇంజనీర్, మేనేజ్మెంట్ సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సెన్స్, అగ్రికల్చర్లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు. విదేశీ వర్సిటీల నుంచి ఐ-20 ఫామ్ పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News September 30, 2024
ముషీరాబాద్: కుల, మతాంతర వివాహలు చట్టబద్ధమే
కుల మతాంతర వివాహాలు రాజ్యాంగబద్ధమేనని ప్రభుత్వం పౌర సమాజం అభ్యుదయ వివాహాలను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధా రాణి పిలుపునిచ్చారు. ఆదివారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు.ఈ సదస్సుకు కేవీఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎం దశరథ్ అధ్యక్షత వహించారు.