News March 29, 2024
HYD: మూసీ సుందరీకరణకు మాస్టర్ PLAN

HYD మూసీ నది వెంట 125 చదరపు కిలోమీటర్ల మేర ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం కానుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జోన్లను నిర్ణయిస్తూ ఆరు నెలల్లో సిద్ధం చేయాలని MRDCLను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. మూసీ డెవలప్మెంట్ కోసం రూ.5,813 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. మూసీకి ఇరువైపులా సుమారు 1KM మేర మాస్టర్ ప్లాన్ పరిధిలోకి రానుంది.
Similar News
News February 17, 2026
HYD: పెళ్లైంది సరే.. ఆ ‘డబుల్ డ్యూటీ’ సంగతేంటి?

‘ఆఫీసులో ఫైళ్లు.. ఇంట్లో గిన్నెలు.. ఈ నరకం ఎన్నాళ్లు’.. కొత్తగా పెళ్లైన ఐటీ ఉద్యోగినుల ఆవేదన ఇది. సమానత్వం అని మాటల్లో చెబుతున్నా ఇంటి బాధ్యతలు మాత్రం ఇంకా ఆడవారికే అప్పజెప్పుతున్నారు. అత్తమామల నిఘా, ఇంటి పనుల భారం భరించలేక ఆఫీసునే ఒక ‘సేఫ్ జోన్’గా భావిస్తున్నారు. అందుకే ఇంటికి త్వరగా వెళ్లడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. పని ఒత్తిడి కంటే ఈ ‘రోల్ ఓవర్లోడ్’ యువతను ఇంటికి దూరం చేస్తోంది.
News February 17, 2026
సైబరాబాద్: 76 వార్డుల్లో సెటిలర్ల ‘సైలెంట్’ సునామీ!

కొత్తగా ఏర్పడిన CYB కార్పొరేషన్ (CMC) ఇప్పుడు 76 వార్డులతో IT బెల్ట్లో తన పట్టు చాటుతోంది. ఇక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా ఆంధ్ర, నార్త్ ఇండియన్ సెటిలర్ల ఓట్లపైనే ఆధారపడి ఉన్నాయి. గత పోల్స్లో BRS తన పాత కోటను కాపాడుకోవాలని చూసినా అధికార కాంగ్రెస్ తన ‘డెవలప్మెంట్’ కార్డుతో సెటిలర్లను ఆకట్టుకుంది. ఇక్కడ <<19167954>>మజ్లిస్<<>> ప్రభావం లేకపోవడంతో ఫైట్ అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ-బీఆర్ఎస్ మధ్యే సాగుతోంది.
News February 17, 2026
GHMC: మజ్లిస్ ‘కోట’.. 150 వార్డుల్లో పాతబస్తీ పవర్!

హైదరాబాద్ విభజన తర్వాత కూడా GHMC తన 150 వార్డుల బలాన్ని కాపాడుకుంది. అయితే, వెస్ట్రన్. ఈస్ట్రన్ జోన్లు విడిపోవడంతో ఇప్పుడున్న GHMCలో మజ్లిస్ (MIM) ఓటు బ్యాంక్ కాన్సంట్రేషన్ అమాంతం పెరిగింది. శంషాబాద్, రాజేంద్రనగర్ ఏరియాలు కలిసినా కోర్ సిటీలో మజ్లిస్ తిరుగులేని ‘డిసైడింగ్ ఫ్యాక్టర్’గా మారింది. మేయర్ పీఠం దక్కాలంటే ఏ పార్టీకైనా మజ్లిస్ అండ ఉండాల్సిందే. విభజన తర్వాత మజ్లిస్ బలం మరింత పెరిగింది.


