News March 29, 2024
HYD: మూసీ సుందరీకరణకు మాస్టర్ PLAN
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711691532729-normal-WIFI.webp)
HYD మూసీ నది వెంట 125 చదరపు కిలోమీటర్ల మేర ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం కానుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జోన్లను నిర్ణయిస్తూ ఆరు నెలల్లో సిద్ధం చేయాలని MRDCLను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. మూసీ డెవలప్మెంట్ కోసం రూ.5,813 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. మూసీకి ఇరువైపులా సుమారు 1KM మేర మాస్టర్ ప్లాన్ పరిధిలోకి రానుంది.
Similar News
News January 16, 2025
RR: గంజాయి, డ్రగ్స్ డిస్పోజల్ చేయాలి: డిప్యూటీ కమిషనర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737025119407_51765059-normal-WIFI.webp)
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో రంగారెడ్డి డివిజన్ ఎక్సైజ్ యంత్రాంగంతో రంగారెడ్డి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. రంగారెడ్డి డివిజన్ పరిధిలోని 20 ఎక్సైజ్ పీఎస్లలో చాలా కేసుల్లో పట్టుబడిన గంజాయి, డ్రగ్స్ డిస్పోజల్ చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా వాహనాల వేలాన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు.
News January 16, 2025
ఇబ్రహీంపట్నంలో దారుణం.. యువతిపై అత్యాచారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737025873347_705-normal-WIFI.webp)
HYD శివారు ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన వెలుగుచూసింది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న స్టూడెంట్పై అత్యాచారం జరిగింది. పూర్తి వివరాలు.. మంగళ్పల్లిలోని ఓ హాస్టల్లో ఉంటున్న యువతి పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. గదిలో ఒంటరిగా ఉన్న ఆమెపై అదే భవనంలో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద పనిచేసే డ్రైవర్ అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో PSలో కేసు నమోదైంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News January 16, 2025
శంకర్పల్లి: మరకత శివాలయానికి హంపి పీఠాధిపతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737006939000_50960982-normal-WIFI.webp)
శంకర్పల్లి మండలం చందిప్పలోని 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయానికి ఫిబ్రవరి 5న హంపి పీఠాధిపతి హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి మహాస్వామి రానున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.