News February 11, 2025

HYD: మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతి

image

మధ్యప్రదేశ్ జబల్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశామన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను అక్కడి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News December 6, 2025

బిల్వ స్వర్గం గుహల్లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్.!

image

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని కనుమకింది కొట్టాల గ్రామ సమీపాన ఉన్న బిళ్ళస్వర్గం గుహల వద్ద సినిమా షూటింగ్ సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా యూనిట్ బృందం గుహల సన్నివేశాల చిత్రీకరణ కోసం వచ్చింది. దీంతో ఈ సందర్భంగా సినిమా యూనిట్ బృందం తరలిరావడంతో గుహల్లో సందడి వాతావరణం నెలకొంది.

News December 6, 2025

VJA: ఇండిగో సమస్య.. హెల్ప్‌లైన్ నంబర్‌ల వివరాలివే.!

image

ఇండిగో విమాన ప్రయాణాలలో సమస్య తలెత్తడంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ఇండిగో హెల్ప్‌లైన్ నంబర్‌లలో లేదా డ్యూటీ టెర్మినల్ మేనేజర్‌ను 9493192531 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు. ఈ నంబర్‌లలో ఇండిగో విమానాల తాజా సమాచారం లభిస్తుందన్నారు.

News December 6, 2025

మెదక్: చివరి రోజు 521 నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో చివరి రోజు 521 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-54, కౌడిపల్లి-101, కుల్చారం-69, మాసాయిపేట-33, నర్సాపూర్-92, శివంపేట-106, వెల్దుర్తి-66 చొప్పున మూడు రోజులై కలిపి 1028 నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు మొత్తం 3528 నామినేషన్లు దాఖలు అయ్యాయి.