News September 10, 2024

HYD: మెగా జాబ్ మేళా.. DON’T MISS

image

గ్రేటర్ HYD పరిధిలో GHMC డోర్ టూ డోర్ GIS ఫీల్డ్ సర్వేయర్ల నియామకానికి SEP 10 నుంచి 13 వరకు మెగా జాబ్ మేళా జరగనుంది. రూ.14 వేల జీతం, అలవెన్స్ ఉంటుంది. 10వ తరగతి పాసై ఉండాలి. 500+ఖాళీలు ఉన్నాయని, శేర్లింగంపల్లి తారానగర్ విద్యానికేతన్ హై స్కూల్ ఎదురుగా Spatial Hawk Geo informatics ప్రైవేట్ లిమిటెడ్ వద్ద జాబ్‌మేళా ఉంటుందని తెలిపారు. 9581519970, 93906 29693 కు సంప్రదించండి.

Similar News

News November 28, 2025

గచ్చిబౌలిలో RS బ్రదర్స్ షోరూమ్ ప్రారంభం

image

RS బ్రదర్స్ 16వ షోరూమ్‌ను గచ్చిబౌలిలో మీనాక్షి చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. కుటుంబంలోని అన్ని తరాల వారి అవసరాలను ప్రతిబింబిస్తూ.. వివాహ వేడుకలకు అవసరమైన కొనుగోళ్లకు గమ్యంగా, సర్వాంగ సుందరంగా ముస్తాబైన షోరూం ప్రారంభోత్సవంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రారంభోత్సవంలో ఛైర్మన్ పొట్టి వెంకటేశ్వర్లు, ఎండీ రాజమౌళి, ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

News November 28, 2025

RR: నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే కారణాలు

image

గ్రామపంచాయతీ ఎన్నిక నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే కారణాలు ఇవే..
– నామినేషన్ పత్రాలను నిర్దిష్ట సమయంలో దాఖలు చేయకపోవడం
– నిర్దేశించిన చోట అభ్యర్థులు, ప్రతిపాదించే వారు సంతకాలు చేయకపోవడం
– ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే
– ఆస్తులు,అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని సరిగ్గా పొందుపర్చకపోవడం
– చట్ట ప్రకారం అవసరమైన డిపాజిట్ నగదును చెల్లించకపోవడం ప్రధాన అంశాలు.

News November 28, 2025

కాంగ్రెస్ తీరు.. రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్: BRS

image

‘రంగారెడ్డి జిల్లా ఫర్ సేల్’ అన్నట్టుగా అధికార కాంగ్రెస్ వ్యవహరిస్తోందని రంగారెడ్డి జిల్లా BRS అధ్యక్షుడు, మాజీ MLA మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలోని శివారు మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసి ప్రజలపై భారీ పన్నుల భారాన్ని మోపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయన తుర్కయంజాల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామన్నారు.