News April 9, 2025
HYD: మెట్రో రైల్ ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి

మెట్రో రైల్ ఎండీగా NVS రెడ్డికి ప్రభుత్వం మళ్లీ అవకాశం కల్పించింది. కీలకమైన రెండో దశ ప్రాజెక్టులో ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక విషయాలపై ఆయనకు అవగాహన ఉందని, అందుకే ఆయన్ని ఆ పదవిలో కొనసాగించినట్లు సమాచారం. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.
Similar News
News December 19, 2025
నల్గొండ: సినీ రంగానికి ప్రభుత్వం మద్దతు: కోమటిరెడ్డి

సినిమా రంగానికి ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్-2025 కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రానికి ఇది ఒక మంచి ఆరంభమని మంత్రి పేర్కొన్నారు. యువ ఫిల్మ్మేకర్స్కి షార్ట్ ఫిల్మ్స్ స్వేచ్ఛను, సృజనాత్మకతను ఇస్తాయని తెలిపారు.
News December 19, 2025
మేడారం జాతరకు వెళ్లే మహిళకు గుడ్న్యూస్

మేడారం జాతరకు టీజీఎస్ఆర్టీసీ రాష్ట్ర నలుమూలల నుంచి భక్తుల సౌకర్యార్థం సుమారు 4000 బస్సులను నడుపుతుందని కరీంనగర్ జోన్ ఈడి పి.సోలమన్ తెలిపారు. ఆర్టీసీ బస్సులలో మహాలక్ష్మి ఉచిత ప్రయాణం పథకం వర్తిస్తుందని వెల్లడించారు. వరంగల్ రీజియన్లోని డిపో మేనేజర్లతో మేడారం-2026 సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడారం జాతర జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగనుందని తెలిపారు.
News December 19, 2025
జగిత్యాల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షునిగా సంకోజి వెంకటరమణ ఏకగ్రీవం

జగిత్యాల జిల్లా కేంద్రంలోని వీకేబి హాల్లో జరిగిన విశ్వబ్రాహ్మణ సంఘం సర్వసభ సమావేశంలో జగిత్యాల పట్టణ శ్రీ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా నాలుగోసారి ఏకగ్రీవంగా సంకోజు వెంకటరమణను ఎన్నుకున్నారు, శుక్రవారం ఏర్పాటుచేసిన సర్వసభ సమావేశంలో అందరి సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో రమణను ఎన్నుకోవడం జరిగిందని, అతని సేవకు ఇది నిదర్శనమని జిల్లా అధ్యక్షుడు టీవీ సత్యం తెలిపారు.


