News March 30, 2025

HYD: మెహందీ ఆర్టిస్ట్ సూసైడ్ (UPDATE)

image

అత్తాపూర్‌లో శనివారం హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ శర్మ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ వాసి <<15926041>>పింకీ(37)<<>> అమిష్‌లోయాను ఇటీవల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. పెద్దలను ఒప్పించి ఏప్రిల్ 22న మరోసారి పెండ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే, తాను జమ చేసిన డబ్బు భర్త షేర్ మార్కెట్‌లో పెట్టి నష్టపోయాడు. ఈ మనస్తాపంతో ఆమె ఉరేసుకుంది.

Similar News

News November 15, 2025

హిందూపురం ఘటన ప్రజాస్వామ్యంపై దాడి: YS జగన్

image

హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు, బాలకృష్ణ అనుచరులు చేసిన హింసాత్మక దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన ప్రత్యక్ష <<18296751>>దాడి<<>> అని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా ఖండించారు. పార్టీ కార్యాలయంపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆయన విమర్శించారు. చంద్రబాబు తన రాజకీయ ఎజెండా కోసం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

News November 15, 2025

శ్రీకాకుళం జిల్లాకు కొత్త ఎయిర్‌పోర్టు

image

AP: ఉత్తరాంధ్రకు మరో ఎయిర్ పోర్టు రానుంది. శ్రీకాకుళం జిల్లాలో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య MOU కుదిరింది. CM CBN, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఒప్పందం జరిగింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని CM తెలిపారు. పర్యాటకరంగం వృద్ధి చెందుతుందన్నారు.

News November 15, 2025

మార్చి నాటికి రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి: కలెక్టర్

image

జిల్లాలో వచ్చే మార్చి నాటికి అన్ని శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమన్వయ సమావేశంలో ఆమె ఈ మేరకు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి భద్రత ఉత్సవాల గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు.