News March 30, 2025
HYD: మెహందీ ఆర్టిస్ట్ సూసైడ్ (UPDATE)

అత్తాపూర్లో శనివారం హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ శర్మ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ వాసి <<15926041>>పింకీ(37)<<>> అమిష్లోయాను ఇటీవల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. పెద్దలను ఒప్పించి ఏప్రిల్ 22న మరోసారి పెండ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే, తాను జమ చేసిన డబ్బు భర్త షేర్ మార్కెట్లో పెట్టి నష్టపోయాడు. ఈ మనస్తాపంతో ఆమె ఉరేసుకుంది.
Similar News
News November 15, 2025
సోమశిల జలాశయం నుంచి నీటి విడుదల

పెన్నా పరీవాహక ప్రాంత పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మ. 2 గంటలకు సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారని అన్నారు. పెన్నా పరీవాహక ప్రాంత పంచాయతీ కార్యదర్శులు, గ్రామాలలో దండోరా వేయించి ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసి, వారిని అప్రమత్తం చేయాలని తెలిపారు. చేపల వేటకు, ఈతకు ఎవరిని వెళ్లకుండా జాగ్రతగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
News November 15, 2025
ADB: 25వ ఏటే అమరుడయ్యాడు!

ఆదివాసీ సమరయోధుడిగా చరిత్రకెక్కెని గొప్ప వీరుడు బిర్సా ముండా. ఆయన 1876నవంబర్ 15న ఝార్ఖండ్ ఉళిహటులో జన్మించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించారు. బిర్సా 1899 డిసెంబర్లో ఉల్గులన్ (విప్లవం) ప్రారంభించారు. ఎన్నో పోరాటాల అనంతరం తొలిసారి 1898లో బ్రిటిషర్లను ఓడించారు. 1900 ఫిబ్రవరి 3న ఆయన్ను అరెస్ట్ చేసి రాంచీ జైల్లో పెట్టారు. 1900జూన్ 9న తన 25వ ఏట జైల్లోనే అమరుడయ్యారు.
News November 15, 2025
సిరిసిల్ల: దుకాణాల సర్దుబాటు కోసం డీల్.. గుడ్ విల్..!

జిల్లాలో మద్యం దుకాణాలు పొందిన వ్యాపారులు తమకు అనుకూలమైన ప్రదేశాలలో వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 48 దుకాణాల కోసం 1,381 దరఖాస్తులు రాగా డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్నవారికి మరో చోట షాపు రావడంతో అక్కడ షాపు లభించిన వారితో చర్చలు జరిపి సర్దుబాటు చేసుకుంటున్నారు. కొత్తగా లైసెన్స్ దక్కిన వ్యక్తికి కోటి రూపాయల గుడ్ విల్ ఇచ్చి దుకాణం తీసుకున్నట్లు టాక్.


