News February 23, 2025

HYD: మోదీ పక్కా బీసీ: MP ఆర్.కృష్ణయ్య

image

నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఎంపీ ఆర్.కృష్ణయ్య మోదీపై వస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు. మోదీ పక్కా బీసీ అని, ఆయన ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. బీజేపీ పూర్తిగా బీసీల పార్టీగా మారిందని, బీజేపీ బీసీని ప్రధానిని చేసిందని, మోదీ ఒక యోగి, సీఎం రేవంత్ మోదీ కులంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. మోదీ ప్రధాని అయ్యాక భారత కీర్తి ప్రతిష్ఠలు ఖండాంతరాలు దాటాయన్నారు.

Similar News

News February 24, 2025

HYD: పదో తరగతి చదువుతున్నారా..? మీకోసమే!

image

పదో తరగతి పూర్తయ్యాక డైరెక్ట్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి డిప్లొమా పాలిటెక్నిక్ విద్య అందుబాటులో ఉంది. ఇందుకోసం పాలీసెట్ ప్రవేశ పరీక్ష మే 16వ తేదీన జరుగుతుందని రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధికారులు తెలిపారు. ఇందుకు ఇప్పటి నుంచే విద్యార్థులు ప్రిపేర్ అయితే మంచిగా రాణించే అవకాశాలు ఉంటాయన్నారు.

News February 24, 2025

ఢిల్లీని మించిన HYD.. జనాభాలో తగ్గేదేలే!

image

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 312 కాగా, హైదరాబాద్ జిల్లాలో ఇది 18,161కు చేరింది. ఇది దేశ రాజధాని ఢిల్లీ (11,313) కంటే ఎక్కువ. హైదరాబాద్ జిల్లా జనాభా సుమారు 39.43 లక్షలు. నగరంలో గ్రామీణ ప్రాంతాలు లేకపోవడంతో ఇది పూర్తిగా శహరీకృతమైంది. జనాభా పెరుగుదలతో మౌలిక వసతుల అభివృద్ధికి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది.

News February 24, 2025

HYD: AIతో 5 నిమిషాల్లో బిల్డింగ్ పర్మిషన్..!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో భవనాల నిర్మాణానికి సంబంధించిన పర్మిషన్లు ఇచ్చేందుకు HMDA సిద్ధమవుతోంది. బిల్డ్ నౌ ఏఐ టెక్నాలజీ ద్వారా భవనాల అనుమతుల ప్రక్రియ సులభతరం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న TGBPASS ద్వారా 40 అంతస్తుల భవనానికి పర్మిషన్ ఇచ్చేందుకు 20-30 రోజుల సమయం పడుతుండగా, AI టెక్నాలజీతో కేవలం ఐదు నిమిషాల్లోనే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందన్నారు.

error: Content is protected !!