News March 9, 2025

HYD: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌‌కు నిధులు

image

TGలో మరో 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. HYD, RR జిల్లాల్లో కొత్తగా చాంద్రాయణగుట్ట, చేవెళ్ల, వికారాబాద్, తాండూరులో ఈ స్కూల్స్ నిర్మిస్తున్నారు. ఒక్కోస్కూల్‌కు రూ.200 కోట్ల చొప్పున కేటాయించారు. గతంలోనే 3 స్కూల్స్‌కు GO ఇచ్చినట్లు భట్టి తెలిపారు. కాగా, గతేడాదే కొందుర్గులో ఈ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు CM శంకుస్థాపన చేశారు.

Similar News

News October 16, 2025

HYD: చేతుల మీదే భారం.. సిటీలో ప్రయాణం!

image

సిటీ శివారులోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులను ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పీక్స్ అవర్‌లో సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి ఉంది. దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం నుంచి ఎల్బీనగర్, ఉప్పల్ రూట్‌లో ఉదయం, సాయంత్రం కూర్చోడానికి కనీసం సీటు దొరకనంత రద్దీ ఉంటోంది. విద్యార్థులు ఫుట్ బోర్డ్‌పై వేలాడుతూ ఇలా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు.

News October 15, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: INCకి వ్యతిరేకంగా 1500 నామినేషన్లు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ఎన్నికలో INCకి వ్యతిరేకంగా 1500 మంది నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. 1000 మంది నిరుద్యోగులు, 300 మంది RRR భూ బాధితులు, 200 మంది మాల కులస్థులు నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్‌ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిస్తేనే అధికార అహంకారం తగ్గుతుందని, అప్పుడే చిత్తశుద్ధితో పని చేస్తారని పోటీదారులు పేర్కొంటున్నారు.

News October 15, 2025

HYD: స్వీట్ షాపుల్లో తనిఖీలు

image

GHMC ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ మూర్తి రాజ్ ఆధ్వర్యంలో గ్రేటర్‌లోని పలు స్వీట్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ రైడ్స్ నిర్వహించినట్లు తెలిపారు. కనీస రూల్స్ పాటించని వ్యాపారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని షాప్‌లకు నోటీసులు జారీ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించామని మూర్తి రాజ్ వెల్లడించారు. సిటీలోని మొత్తం 43 స్వీట్ షాపుల్లో ఈ తనికీలు కొనసాగాయి.