News March 9, 2025
HYD: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధులు

TGలో మరో 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. HYD, RR జిల్లాల్లో కొత్తగా చాంద్రాయణగుట్ట, చేవెళ్ల, వికారాబాద్, తాండూరులో ఈ స్కూల్స్ నిర్మిస్తున్నారు. ఒక్కోస్కూల్కు రూ.200 కోట్ల చొప్పున కేటాయించారు. గతంలోనే 3 స్కూల్స్కు GO ఇచ్చినట్లు భట్టి తెలిపారు. కాగా, గతేడాదే కొందుర్గులో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్కు CM శంకుస్థాపన చేశారు.
Similar News
News November 27, 2025
సారీ.. అంచనాలు అందుకోలేకపోయాం: పంత్

తాము సరిగ్గా ఆడలేదని ఒప్పుకోవడానికి సిగ్గు పడట్లేదని కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపారు. ‘జట్టుగా, వ్యక్తిగతంగా మేమెప్పుడూ హయ్యెస్ట్ లెవల్లో పర్ఫార్మ్ చేసి కోట్లమంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తేవాలనుకుంటాం. ఈసారి ఆ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. దేశానికి ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణం. ఈ జట్టు ఏం చేయగలదో మాకు తెలుసు. ఈసారి జట్టుగా, వ్యక్తిగతంగా మంచి కంబ్యాక్ ఇస్తాం’ అని ట్వీట్ చేశారు.
News November 27, 2025
పీ-4 కార్యక్రమానికి పెద్ద మనసుతో ముందుకు రావాలి: మంత్రి

నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో పీ-4 కార్యక్రమం అమలుపై గురువారం సమీక్షించారు. పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు అధికారులు పెద్ద మనసుతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముందుకు వస్తే తొలి నా వంతు సాయంగా రూ.10 లక్షలు అందిస్తానన్నారు.దొంగతనం జరిగిన కొన్ని గంటల్లోనే రికవరీ చేస్తున్న పోలీసులను అభినందించారు.
News November 27, 2025
భారీ వర్షాలు.. రైతులకు కీలక సూచనలు

భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రైతులకు కొన్ని సూచనలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల వరి కోతల సీజన్ నడుస్తోంది. కోత పూర్తైన వరి పంటను/ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులకు సూచించింది. ధాన్యాన్ని కుప్పలుగా పోసి టార్పాలిన్ కప్పాలని, ఒకవేళ వానకు ధాన్యం తడిస్తే రంగుమారకుండా, మొలకెత్తకుండా వ్యవసాయ నిపుణుల సూచనలు పాటించాలని కోరింది.


