News March 9, 2025
HYD: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధులు

TGలో మరో 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. HYD, RR జిల్లాల్లో కొత్తగా చాంద్రాయణగుట్ట, చేవెళ్ల, వికారాబాద్, తాండూరులో ఈ స్కూల్స్ నిర్మిస్తున్నారు. ఒక్కోస్కూల్కు రూ.200 కోట్ల చొప్పున కేటాయించారు. గతంలోనే 3 స్కూల్స్కు GO ఇచ్చినట్లు భట్టి తెలిపారు. కాగా, గతేడాదే కొందుర్గులో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్కు CM శంకుస్థాపన చేశారు.
Similar News
News November 18, 2025
సచివాలయాలకు పర్యవేక్షకులు వీరే..

AP: గ్రామ, వార్డు సచివాలయాలకు మండల స్థాయిలో పర్యవేక్షకులుగా 660 మంది డిప్యూటీ MPDOలను ప్రభుత్వం నియమించనుంది. అలాగే జిల్లా స్థాయిలో పర్యవేక్షకులుగా ZP CEO, డిప్యూటీ సీఈవో, జాయింట్ డైరెక్టర్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు అప్పగించనుంది. నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించిన విషయం తెలిసిందే. A కేటగిరీలో ఆరుగురు, Bలో 7, Cలో ఎనిమిది మంది ఉద్యోగులు ఉంటారు.
News November 18, 2025
సచివాలయాలకు పర్యవేక్షకులు వీరే..

AP: గ్రామ, వార్డు సచివాలయాలకు మండల స్థాయిలో పర్యవేక్షకులుగా 660 మంది డిప్యూటీ MPDOలను ప్రభుత్వం నియమించనుంది. అలాగే జిల్లా స్థాయిలో పర్యవేక్షకులుగా ZP CEO, డిప్యూటీ సీఈవో, జాయింట్ డైరెక్టర్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు అప్పగించనుంది. నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించిన విషయం తెలిసిందే. A కేటగిరీలో ఆరుగురు, Bలో 7, Cలో ఎనిమిది మంది ఉద్యోగులు ఉంటారు.
News November 18, 2025
MLA కౌశిక్పై శ్రీశైలం యాదవ్ కామెంట్స్.. BRS ON FIRE

HZB MLA పాడి కౌశిక్ రెడ్డిపై జూబ్లీహిల్స్ MLA తండ్రి శ్రీశైలం యాదవ్ చేసిన కామెంట్స్పై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఓ MLAపై శ్రీశైలం అలాంటి వ్యాఖ్యలు చేయడం గుండాయిజమేనని BRS నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయొద్దని, పోటీచేస్తే ఓడిపోతావని నవీన్తో కౌశిక్ అనడంపై ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో శ్రీశైలం యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్కు జీవితం ఇచ్చిందే తామని, తను దెబ్బలు తింటే నవీన్ కాపాడాడన్నారు.


