News July 27, 2024
HYD: యాక్సిడెంట్లో చనిపోయింది వీళ్లే..!

శామీర్పేట్లో శుక్రవారం <<13709545>>రోడ్డు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. హకీంపేట వాసి, సాఫ్ట్వేర్ ఉద్యోగి శేఖర్(25), మౌలాలి వాసి, ఐటీ ఉద్యోగి దీపిక(23) ఇన్నోవా కారులో గజ్వేల్ నుంచి HYD వైపు రాజీవ్ రహదారి మీదుగా వస్తున్నారు. తుర్కపల్లి సమీపంలో కారును అతివేగంగా నడపడంతో అదుపుతప్పి ఎదురుగా వచ్చే బస్సును, బైక్ను ఢీకొట్టారు. శేఖర్, దీపిక చనిపోగా బైక్పై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి.
Similar News
News November 9, 2025
శంషాబాద్: మూడు విమానాలు రద్దు

వివిధ గమ్యస్థానాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం రాకపోకలు సాగించే మరో 3 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి HYD రావాల్సిన విమానం, జైపూర్ నుంచి HYD రావల్సిన 2 విమానాలు రద్దయ్యాయి. అలాగే సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేసినట్లు ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి.
News November 9, 2025
HYD: ఫ్రాన్స్లో MBBS పూర్తి చేసి ఉగ్రవాదం వైపు

ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన వారిలో హైదరాబాదీ మొహియుద్దీన్ ఉండటం చర్చనీయాంశమైంది. నిందితుడిని రాజేంద్రనగర్ ఫారెస్ట్ వ్యూస్ కాలనీలోని గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అతడు ఫ్రాన్స్లో MBBS పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఇంత చదివి ప్రజల ప్రాణాలు బలిగొనే ఉగ్రవాదంవైపు ఆకర్షితులవుతుండటంతో యువతరం ఏమైపోతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇంట్లో సోదాలు చేయగా గన్స్ దొరికాయి.
News November 9, 2025
HYD: వారి జోలికి హైడ్రా వెళ్లదు: రంగనాథ్

నగరంలో తొలి విడతలో 6 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువుల ఆక్రమణలను తొలగించి 105 ఎకరాల నుంచి 180 ఎకరాలకు పెంచామన్నారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నవారు హైడ్రాపై దాదాపు 700 వరకు కేసులు పెట్టారని, 2024 జులైకి ముందు నుంచే నివాసం ఉన్న వారి ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదన్నారు.


