News February 13, 2025

HYD: రంగరాజన్‌పై దాడి.. 12 మంది అరెస్ట్

image

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే దాడి కేసులో ఇప్పటివరకు పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 14 మంది పరారీలో ఉన్నారు. వీరిలో భద్రాచలం వద్ద మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Similar News

News March 17, 2025

HYD: అమెరికాలో ప్రమాదం.. కొందుర్గు వాసులు మృతి

image

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు చనిపోయారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లికి చెందిన BRS నాయకుడు, మాజీ MPTC, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి(35), మనవడు హార్వీన్ (6), సునీత (56) మృతి చెందారు. ప్రగతి అత్త సునీత సిద్దిపేట జిల్లా బక్రీ చప్రియాల్ గ్రామం. అయితే, అంత్యక్రియలు అక్కడే చేస్తున్నట్లు సమాచారం.

News March 17, 2025

రాజేంద్రనగర్‌ NIRDPRలో రూ. లక్ష జీతంతో ఉద్యోగం

image

రాజేంద్రనగర్‌లోని NIRDPRలో కాంట్రాక్ట్ బేసిస్ కింద 33 పోస్టులను భర్తీ చేస్తున్నారు. బీటెక్, PG, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు మాత్రమే అర్హులు. వయస్సు 60 ఏళ్లకు మించకూడదు. జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ. 1,00,000, ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ. 1,40,000, ప్రోగ్రాం ఆఫీసర్‌రు రూ. 1,90,000 జీతం చెల్లిస్తారు. అప్లై చేసేందుకు మార్చి 19 చివరి తేదీ.

SHARE IT

News March 17, 2025

HYDలో ఔరంగజేబు వెనక్కి తగ్గాడు

image

‘ఛావా’ చూసిన అందరికీ ఔరంగ జేబు క్రూరత్వం తెలిసే ఉంటుంది. 17వ శతాబ్దంలో ఆయన HYD వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. గోల్కొండ కోట ఆక్రమించుకుని హిందూ దేవాలయాలు ధ్వంసం చేయాలని HYD వచ్చాడు. ఇక్కడ ధ్యానాంజనేయ ఆలయంలో ఓ శబ్దం విన్నాడు. ‘హే రాజన్ మందిర్ తోడ్నా హైతో పెహ్లే తుమ్ కరో మన ఘట్’ అనే రామదూత స్వరం విని వెనక్కి తగ్గాడని, అప్పటినుంచి ఈ ప్రాంతాన్ని కర్మన్‌ఘాట్‌గా పిలుస్తున్నారని స్థల పురాణం చెబుతోంది.

error: Content is protected !!