News February 13, 2025
HYD: రంగరాజన్పై దాడి.. 12 మంది అరెస్ట్

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే దాడి కేసులో ఇప్పటివరకు పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 14 మంది పరారీలో ఉన్నారు. వీరిలో భద్రాచలం వద్ద మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Similar News
News March 25, 2025
రేపు 108 మండలాల్లో వడగాలుల ప్రభావం

AP: రేపు రాష్ట్రంలోని <
News March 25, 2025
ఒంగోలు: మాజీ సీఎం జగన్తో జిల్లా వైసీపీ నేతల సమావేశం

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు మాజీ సీఎం జగన్ను కలిశారు. జిల్లా నాయకులతో వైసీపీ బలోపేతంపై మాజీ సీఎం జగన్ చర్చించారు. జగన్ను కలిసిన వారిలో జడ్పీ ఛైర్ పర్సన్ వెంకాయమ్మ, వై.పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, దద్దాల నారాయణ ఉన్నారు.
News March 25, 2025
రేపు విజయవాడకి రానున్న మాజీ సీఎం జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకి రానున్నారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఎమ్మెల్సీ రుహుల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మాజీ సీఎం జగన్ రానున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని పేర్కొన్నారు.