News April 3, 2024
HYD: రసూల్పురలో యువకుడి హత్య

HYD బేగంపేటలోని రసూల్పుర అంబేడ్కర్నగర్లో దారుణఘటన చోటుచేసుకుంది. గతరాత్రి తరుణ్ అనే యువకుడిపై నలుగురు దాడి చేశారు. బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 16, 2025
HYD: చేతుల మీదే భారం.. సిటీలో ప్రయాణం!

సిటీ శివారులోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులను ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పీక్స్ అవర్లో సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి ఉంది. దిల్సుఖ్నగర్ నుంచి ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం నుంచి ఎల్బీనగర్, ఉప్పల్ రూట్లో ఉదయం, సాయంత్రం కూర్చోడానికి కనీసం సీటు దొరకనంత రద్దీ ఉంటోంది. విద్యార్థులు ఫుట్ బోర్డ్పై వేలాడుతూ ఇలా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు.
News October 15, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: INCకి వ్యతిరేకంగా 1500 నామినేషన్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ఎన్నికలో INCకి వ్యతిరేకంగా 1500 మంది నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. 1000 మంది నిరుద్యోగులు, 300 మంది RRR భూ బాధితులు, 200 మంది మాల కులస్థులు నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిస్తేనే అధికార అహంకారం తగ్గుతుందని, అప్పుడే చిత్తశుద్ధితో పని చేస్తారని పోటీదారులు పేర్కొంటున్నారు.
News October 15, 2025
HYD: స్వీట్ షాపుల్లో తనిఖీలు

GHMC ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ మూర్తి రాజ్ ఆధ్వర్యంలో గ్రేటర్లోని పలు స్వీట్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ రైడ్స్ నిర్వహించినట్లు తెలిపారు. కనీస రూల్స్ పాటించని వ్యాపారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని షాప్లకు నోటీసులు జారీ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించామని మూర్తి రాజ్ వెల్లడించారు. సిటీలోని మొత్తం 43 స్వీట్ షాపుల్లో ఈ తనికీలు కొనసాగాయి.