News April 3, 2024
HYD: రసూల్పురలో యువకుడి హత్య

HYD బేగంపేటలోని రసూల్పుర అంబేడ్కర్నగర్లో దారుణఘటన చోటుచేసుకుంది. గతరాత్రి తరుణ్ అనే యువకుడిపై నలుగురు దాడి చేశారు. బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 1, 2026
HYD: నకిలీ ఇన్సూరెన్స్లు.. 9 మంది అరెస్ట్

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల పేర్లతో నకిలీ వాహన బీమా పత్రాలను సృష్టిస్తున్న 9మంది ముఠా సభ్యులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా నకిలీ పత్రాలు, స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్ వెల్లడించారు. అవసరంలో ఉన్న వాహనదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. ప్రజలు అధికారిక వెబ్సైట్ల ద్వారానే బీమా తీసుకోవాలని పోలీసులు సూచించారు.
News March 1, 2026
HYD: ఇవి కాపాడుకుంటే ₹కోట్లు సంపాదించొచ్చు

ఆరోగ్యమే మహా భాగ్యం అని పెద్దలు చెబుతారు. ఈ సూత్రం ఎప్పటికీ వర్తిస్తుందని HYD జీవన్ దాన్ అధికారులు పేర్కొన్నారు. కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, గుండె కవాటాలు, కిడ్నీలు ₹కోట్లు పెట్టినా దొరకకపోవచ్చని వాటిని పదిలంగా కాపాడుకోవాలని సూచించారు. చెడు అలవాట్ల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ₹లక్షల్లో సేవ్ చేసుకోవచ్చని తెలిపారు. కాగా.. అవయవాలు ఫెయిలైనవారు 4వేల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
News March 1, 2026
HYDలో అవినీతి ‘సిస్టమ్’ మారేనా?

GHMC పరిధిలో ACB దాడుల పరంపర కేవలం అధికారుల అవినీతిని బయటపెట్టడమే కాదు.. వ్యవస్థలో పాతుకుపోయిన ‘పర్సెంటేజీ’ల దందాను కూడా ఎండగడుతోంది. చట్టపరంగా చూస్తే 64 శాతం శిక్షా రేటు అనేది న్యాయస్థానాలు అవినీతిపై చూపిస్తున్న కఠిన వైఖరికి నిదర్శనం. రాజకీయంగా కూడా ప్రభుత్వం 115 ప్రాసిక్యూషన్ శాంక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. అయితే, శిక్షలు ఒకవైపు.. వ్యవస్థ ప్రక్షాళన మరోవైపు సాగాల్సిందే!


