News August 18, 2024
HYD: రాఖీ కడుతుందని అనుకున్నారు.. ఇంతలోనే విషాదం

HYD ఉప్పల్ పరిధి హబ్సిగూడలో శనివారం రోడ్డు ప్రమాదంలో <<13876672>>విద్యార్థిని సాత్విక(16)<<>> మరణించిన విషయం తెలిసిందే. తార్నాకలోని కింతి కాలనీ వాసి రంగ గోపీనాథ్ గౌడ్ రైల్వే ఉద్యోగి. ఆయనకు ఇద్దరు కుమారులతో పాటు కూతురు సాత్విక సంతానం. ఒక్క రోజైతే రాఖీ పండుగ.. ఇంతలోనే తన ఒక్కగానొక్క గారాలపట్టి కూతురు యాక్సిడెంట్లో చనిపోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఏసీపీ జగన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 22, 2025
REWIND 2023 పోల్.. జూబ్లీహిల్స్లో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే?

2023 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. BRS నుంచి పోటీ చేసి మాగంటి గోపీనాథ్ 80,549 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ 64,212 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించగా ఎంఐఎం అభ్యర్థి రషీద్ ఫరాజుద్దీన్ 7,848 ఓట్లు పొందారు.
News October 22, 2025
జూబ్లీహిల్స్: నేటి నుంచి నామినేషన్ల పరిశీలన..!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. మంగళవారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక నేటి నుంచి వాటి పరిశీలన కార్యక్రమం కొనసాగనుంది. వందలాది నామినేషన్లు రావడంతో పూర్తి పరిశీలనకు కాస్త సమయం పట్టే అవకాశముంది. ఇదిలా ఉండగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈనెల 24 వరకు అవకాశం ఉంది.
News October 22, 2025
HYD: HMDAకు ఈ ఏడాది రూ.కోట్లల్లో ఆదాయం..!

HMDAకు ఈ సంవత్సరం రూ.1,225 కోట్లు ఆదాయం వచ్చింది. మల్టీ స్టోర్డ్ బిల్డింగ్లు, భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల పర్మిషన్లకు సంబంధించి ఈ సంవత్సరం 3,667 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 79 శాతం అంటే 2,887 దరఖాస్తులకు పర్మిషన్ ఇచ్చింది. వీటి నుంచి రూ.1,225 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఇది 245 శాతం ఎక్కువ అని హెచ్ఎండీఏ పేర్కొంది.